Breaking News: Earthquake- రెండు దేశాల్లో భూకంపం..భయంతో ప్రజలు పరుగులు

Read Time:  1 min
Earthquake
Earthquake
FONT SIZE
GET APP

ఇటీవల ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి. భూకంపాలు(Earthquake), క్లౌడ్ బరస్ట్ లు, తుపానులు, కొండచరియలు విరిగిపడడం వల్ల భారీగా జననష్టంతో పాటు ఆస్తి నష్టాలు చవిచూస్తున్నాం. నైజీరియాలో ఇటీవల కొండచరియలు విరిగిపడడం ఓ గ్రామం గ్రామమే తుడిచిపెట్టుకుని పోయింది. వెయ్యికి మందిపైగా మరణించారు.

ఇలాంటి విషాదాలు మరువకముందే మళ్లీ మయన్మార్, ఆఫ్ఘనిస్థాన్ లో రిక్టర్ స్కేల్ 4.8 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందళోనతో పరుగులు పెట్టారు. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

మయన్మార్(Myanmar)లో రిక్టర్ స్కేల్ పై 4.7 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్కోలజీ తెలిపింది.

ఆఫ్ఘనిస్థాన్లో భూకంపం

గురువారం మయన్మార్తో పాటు ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) లో కూడా మరోసారి భూకంపం వణికించింది. మూడురోజుల క్రితమే భారీ భూకంపం నుంచి ఆఫ్గాన్ ఇంకా కోలుకోలేదు. దాదాపు 1400 మందికి పైగా మరణించారు. భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. వెయ్యిమందికి పైగానే గాయపడ్డారు.

మళ్లీ భూమి కంపించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీసారు. భారతదేశంలో కూడా ఇటీవల విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. భూకంపం(Earthquake) లేకపోయినా క్లౌడ్ బరస్ట్, ల్యాండ్సైడ్ వంటి ఘటనలు పెరుగుతున్నాయి.

మయన్మార్‌లో భూకంపం ఎంత తీవ్రతతో వచ్చింది?
మయన్మార్‌లో రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.

మయన్మార్‌లో వచ్చిన అతి పెద్ద భూకంపం ఏది?

మయన్మార్‌ను తాకిన అతి పెద్ద భూకంపం 2025 మార్చి 28న సంభవించిన 7.7 తీవ్రత గల

Read Hindi news: Hindi.vaartha.com

Read also:

https://vaartha.com/america-america-is-in-turmoil-due-to-economic-recession/international/541065/

Digital

రచయిత గురించి

Digital

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.