हिन्दी | Epaper

Chhattisgarh: మళ్ళీ ఎన్‌కౌంటర్ – బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం

Shobha Rani
Chhattisgarh: మళ్ళీ ఎన్‌కౌంటర్ – బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పీడియా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌(encounter)లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ప్రస్తుతం కూడా ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.తాజాగా బీజాపూర్ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌(encounter) లో ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఇంకా కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అబూజ్‌మాడ్‌లో భారీ నష్టాలు – మృతుల సంఖ్య 27
కాగా, నిన్న నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌(encounter)లో 27 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా మృతి చెందాడు. అలాగే, బాపట్ల జిల్లాకు చెందినట్లుగా భావిస్తున్న మరో కీలక నేత సజ్జ నాగేశ్వరరావు కూడా ఈ ఎన్‌కౌంటర్‌(encounter)లో మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే, మృతదేహాలను గుర్తించి, పోస్టుమార్టం నిర్వహించిన తర్వాతే ఈ విషయంపై అధికారిక స్పష్టత రానుంది. ఈ ఘటనలో గాయపడిన రమేష్ అనే జవాను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో, మొత్తం ఇద్దరు జవాన్లు మరణం పొందినట్లయింది.

Chhattisgarh: మళ్ళీ ఎన్‌కౌంటర్ – బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం
Chhattisgarh: మళ్ళీ ఎన్‌కౌంటర్ – బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం

కొనసాగుతున్న కూంబింగ్ – మృతదేహాల గుర్తింపు దశలో
అబూజ్‌మాడ్ ఘటన స్థలంలో భద్రతా బలగాలు ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. గాయపడి తప్పించుకున్న మావోయిస్టుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడం, భారీ వర్షం కురుస్తుండటంతో మృతదేహాలను తరలించే ప్రక్రియ ఆలస్యమవుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి. కొన్ని మృతదేహాలను మాత్రమే నారాయణ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. మృతుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత, వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

మోదీ, అమిత్ షా, భూపేష్ బగేల్ ప్రశంసలు
కర్రె గుట్టలో సుమారు 24 రోజుల క్రితం జరిగిన ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మరణించినప్పటికీ, అగ్రనేతలు తప్పించుకున్నారు. దీంతో, అబూజ్‌మాడ్‌ను సురక్షిత ప్రాంతంగా భావించి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు నంబాల కేశవరావు నేతృత్వంలో కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో స్థాయి నేతలు సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఈ పక్కా సమాచారంతోనే భద్రతా బలగాలు మూడు రోజులుగా వ్యూహాత్మకంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దాడి చేశాయి. మావోయిస్టులకు మూడు నుంచి నాలుగు అంచెల భద్రత ఉన్నప్పటికీ, బలగాలు వారిని ఛేదించి భారీ విజయం సాధించాయని తెలుస్తోంది. ఈ ఆపరేషన్ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, హోంమంత్రి భద్రతా బలగాలను అభినందించారు. అబూజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆపరేషన్‌తో మావోయిస్టులకు తీవ్ర నష్టం. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఎస్ఒజి, డీఆర్పీ, కోబ్రా దళాలు భారీ నిఘాతో ముందడుగు. భవిష్యత్తులో మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది.

Read Also: Arunachal Pradesh Exam: పరీక్షలో హైటెక్ మోసం..దేశవ్యాప్తంగా సంచలనం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

అమెరికా ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన సూసైడ్ బోటు

అమెరికా ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన సూసైడ్ బోటు

ట్రంప్ ట్రేడ్ ఇన్వెస్టిగేషన్: భారత్‌కు ఎదురుదెబ్బ.. అమెరికాతో వ్యాపారం కష్టమేనా?

ట్రంప్ ట్రేడ్ ఇన్వెస్టిగేషన్: భారత్‌కు ఎదురుదెబ్బ.. అమెరికాతో వ్యాపారం కష్టమేనా?

అమెరికా నౌకపై ఇరాన్ దాడి.. భారత నావికుడి మృతి

అమెరికా నౌకపై ఇరాన్ దాడి.. భారత నావికుడి మృతి

హర్ముజ్ జలసంధిలో భారత్‌ ట్యాంకర్లకు లైన్ క్లియర్!

హర్ముజ్ జలసంధిలో భారత్‌ ట్యాంకర్లకు లైన్ క్లియర్!

పశ్చిమాసియాలో ఆరోగ్య సంక్షోభం: WHO డైరెక్టర్ జనరల్ ఆందోళన

పశ్చిమాసియాలో ఆరోగ్య సంక్షోభం: WHO డైరెక్టర్ జనరల్ ఆందోళన

బంగ్లాదేశ్‌లో ఇంధన సెగ.. యూనివర్సిటీలకు సెలవులు

బంగ్లాదేశ్‌లో ఇంధన సెగ.. యూనివర్సిటీలకు సెలవులు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

గల్ఫ్ దేశాల నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు

గల్ఫ్ దేశాల నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు

యుద్ధం ముగియాలంటే ఆ ‘మూడు’ షరతులకు తలొగ్గాల్సిందే.. ఇరాన్ సంచలన డిమాండ్లు!

యుద్ధం ముగియాలంటే ఆ ‘మూడు’ షరతులకు తలొగ్గాల్సిందే.. ఇరాన్ సంచలన డిమాండ్లు!

గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

📢 For Advertisement Booking: 98481 12870