ఒక వ్యక్తిపై పగ తీర్చుకోవాలంటే అందుకు పెద్ద కారణాలు అక్కర్లేదు. చిన్న కారణాలకే ఎదుటివారిపై ఉన్న పగను తీర్చుకుంటున్నారు. కెనడాలో(Canada) ఇదే జరిగింది. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తను ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో ఐదురోజులు మృత్యువుతో పోరాడిన ఆయన గత శుక్రవారం తుదిశ్వాస వదిలాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
read also: Mallikarjun Kharge: ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయాలి : మల్లిఖార్జున్ ఖర్గే

కారుపై మూత్ర విసర్జన వద్దన్నందుకు దాడి.
55 ఏళ్ల అర్విసింగ్ సాగూ తన స్నేహితురాలితో కలిసి రాత్రి బయటకు వెళ్లాడు. నగరంలోని (Canada) ఓ రెస్టారెంట్ లో భోజనం చేసి తిరిగి ఇంటికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తమ కారు వద్దకు వస్తుండగా, అప్పటికే ఒక అపరిచితుడు సాగూ కారుపై మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. తన కారుపై పోస్తున్న వ్యక్తిని సాగూ నివారించేందుకు ప్రయత్నించాడు. ఆపమంటూ అరిచాడు సాగూ. దానికి ఆ అపరిచితుడు అహంకారంగా ‘నా ఇష్టం..ఏమి చేయాలనుకుంటే అది చేస్తాను’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఆక్కడితో ఆగకుండా వెంటనే సాగూ వద్దకు వేగంగా వచ్చి, క్షణాల్లోనే అతని తలపై పిడిగుద్దులు గుద్దాడు.
దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సాగూ, ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న అతడి స్నేహితురాలు వెంటనే అతడిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. అంతేకాక సాగూ సోదరుడికి, అతడి భార్యకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృత్యువుతో పోరాడి ఓడిన సాగూ ఐదురోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాగు గత శుక్రవారం మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని కైల్ పాపిన్ గా ఎడ్మంటన్ పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: