Canada Indian students death : విదేశాల్లో భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక వివరాలను వెల్లడించింది. 2018 నుంచి 2025 వరకు గడిచిన ఏడేళ్ల కాలంలో Canada లోనే అత్యధికంగా 17 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందినట్లు తెలిపింది.
కెనడా తర్వాత United States లో 9 మంది, Australia లో 3 మంది, Kyrgyzstan లో ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. అదేవిధంగా బ్రిటన్, జర్మనీ, చైనా, డెన్మార్క్, గ్రెనడా దేశాల్లో ఒక్కరు చొప్పున మరణించినట్లు కేంద్రం పేర్కొంది.
Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

ఈ అంశంపై Asaduddin Owaisi లోక్సభలో ప్రశ్న లేవనెత్తారు. విదేశాల్లో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వానికి అవగాహన ఉందా? ఈ ఘటనలపై సకాలంలో విచారణ జరుగుతుందా? అని ఆయన అడిగారు.
దీనికి స్పందించిన విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి Kirti Vardhan Singh లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్యార్థులపై జరిగే దాడులు, హింసాత్మక ఘటనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: