అమెరికా, వెనిజులాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాది. ఆ దేశంలో డ్రగ్స్ (Drugs) ను కట్టడి చేసేందుకు అమెరికా తెగ ప్రయత్నాలుచేస్తోంది. ఇందులో భాగంగా డ్రగ్స్ సరఫరా సమాచారంతో మంగళవారం మరో వెనిజులా బోట్ మీద దాడి చేసింది. యూఎస్ సైన్యం.ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది.
మరోవైపు వెనిజులాపై అమెరికా ఏ క్షణమైనా యుద్ధానికి దిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే అగ్రరాజ్యం దక్షిణ కరేబియన్ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలను మోహరించింది. అమెరికా ప్రజలను చంపేందుకు మత్తుపదార్థాలను సరఫరా చేస్తే వేటాడి ఎంటాడు చంపుతామని అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. వెనిజులా బోట్ పై అమెరికా దాడిచేయడంతో రెండు దేశాలమధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
వెనిజులా అధ్యక్షుడిని పట్టిస్తే భారీ బహుమానం
వెనిజులా, అమెరికా దేశాలమధ్య వైరం ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో ఈ రెండుదేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. వెనిజులా (Venezuela) నుంచి భారీఎత్తున మాదకద్రవ్యాలు అమెరికాకు సరఫరా అవుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో దీనికి
మద్దతు ఇస్తున్నారని, ఆయను పట్టిస్తే 50 మిలియన్ డాలర్లు బహుమతి ఇస్తామని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. అంతేకాక వెనిజులా,ప్రభుత్వాన్ని కూల్చేందుకు ట్రంప్ ప్రభుత్వం యత్నిస్తున్నది.
కరేబియన్ సముద్రంలోకి అమెరికా (America) భారీ యుద్ధనౌకలు, జలాంతర్గాములను,
అత్యాధునిక ఫైటర్ జెట్ లను రంగంలోకి దింపింది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశమైన వెనిజులాపై దాడి చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంది.వెనిజులాను ఆక్రమించుకునేందుకు అమెరికా తీవ్రంగా యత్నిస్తున్నది. మాదకద్రవ్యాల ముఠా (Drug gang) ల కోసమే ఆ దేశంపై యుద్ధం చేసేందుకు కారణమని ట్రంప్ చెబుతున్నారు. ఇందుకోసం అమెరికా మొత్తం ఎనిమిది యుద్ధనౌకల (warships) ను పంపించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: