Bangladesh:‘ది బ్యాటిల్ ఆఫ్ ది బేగమ్స్’కు ముగింపు.. ఖలీదా జియా శకం ఎండ్

Read Time:  1 min
Bangladesh
Bangladesh
FONT SIZE
GET APP

బంగ్లాదేశ్ రాజకీయాలను నాలుగు దశాబ్దాలకుపైగా ప్రభావితం చేసిన ప్రముఖ నేత, మాజీ ప్రధాని ఖలీదా జియా (80) అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక కీలక అధ్యాయానికి ముగింపు పలికింది.

Read Also: Khaleda Zia: పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన ఖలీదా జియా

Bangladesh
Bangladesh: The end of ‘The Battle of the Begums’.. The end of Khaleda Zia’s era

సైనిక పాలనకు ముగింపు.. ప్రజాస్వామ్యానికి దారి

1991లో ఖలీదా జియా బంగ్లాదేశ్(Bangladesh) తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సైనిక పాలనకు తెరదించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని స్థాపించడంలో ఆమె పాత్ర చారిత్రాత్మకమైంది. అధ్యక్ష తరహా పాలనను రద్దు చేసి, పార్లమెంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టి అధికారాన్ని ప్రధాని చేతుల్లోకి తీసుకువచ్చారు.

ఖలీదా జియా – షేక్ హసీనాల మధ్య సాగిన తీవ్ర రాజకీయ పోటీ ‘ది బ్యాటిల్ ఆఫ్ ది బేగమ్స్’గా ప్రసిద్ధి చెందింది. 1980ల నుంచే ఈ ఇద్దరి మధ్య వైరం కొనసాగింది. నాలుగు దశాబ్దాలపాటు బంగ్లాదేశ్‌లో అధికారం ఈ ఇద్దరి మధ్యే మారుతూ వచ్చింది.
1996లో హసీనా చేతిలో ఓడిన జియా, 2001లో భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చారు.

రాజకీయ జీవితం, విమర్శలు, వివాదాలు

జియా రెండోసారి ప్రధాని అయిన సమయంలో ఇస్లామిక్ తీవ్రవాదం, అవినీతి ఆరోపణలు దేశాన్ని కుదిపేశాయి. 2004లో షేక్ హసీనాపై జరిగిన గ్రెనేడ్ దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై జియా ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
2007లో సైనిక జోక్యంతో దేశం రాజకీయ సంక్షోభంలోకి వెళ్లింది.

1975లో షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్య తర్వాత దేశ రాజకీయాలు(Bangladesh) మారాయి. 1977లో ఖలీదా జియా భర్త జియౌర్ రెహ్మాన్ అధ్యక్షుడయ్యారు. ఆయన 1981లో హత్యకు గురైన తర్వాత, అప్పటికి 35 ఏళ్ల వయసున్న ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నాయకత్వాన్ని స్వీకరించారు. మొదట్లో రాజకీయ అనుభవం లేని వ్యక్తిగా భావించినా, క్రమంగా దేశ రాజకీయాల్లో శక్తివంతమైన నేతగా ఎదిగారు.

షేక్ హసీనా సంతాప సందేశం

ఖలీదా జియా మృతిపై మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర సంతాపం ప్రకటించారు.
“బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా, ప్రజాస్వామ్య స్థాపనలో ఆమె పాత్ర మరువలేనిది. దేశానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమైనవి” అని అవామీ లీగ్ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు.
జియా కుటుంబ సభ్యులకు, BNP కార్యకర్తలకు ఆమె సానుభూతి తెలిపారు. 2026 ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయ మార్పులు జరుగుతున్న సమయంలో ఖలీదా జియా మరణించడం రాజకీయంగా కీలకంగా మారింది. ఆమె మరణంతో బీఎన్‌పీకి తీరని లోటు ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.