బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) సహా ప్రభుత్వంలోని మహిళా ఉద్యోగులను ‘సర్’ అని సంబోధించాలన్న ఆదేశాలను (Sir Title For Women Officials) రద్దు చేసింది. అడ్వైజరీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

బంగ్లాదేశ్ను హసీనా (Sheikh Hasina) దాదాపు 16 ఏళ్లు పాలించింది. తన పాలనలో అధికారులు తనతో సహా మహిళా అధికారులను ‘సర్’ అని సంబోధించాలంటూ ఆదేశించింది. హసీనా (Sheikh Hasina) ప్రధానిగా ఉన్నంత కాలం అందరూ ఆమెను ‘మేడమ్’ అని కాకుండా ‘సర్’ అనే పిలిచేవారు. ఇప్పటకీ హసీనా జారీ చేసిన ఆదేశాలే అమలవుతున్నాయి. అయితే, మహిళా అధికారులను ‘సర్’ అని పిలవడం సామాజికంగా, సంస్థాగతంగా అనుచితమైనది కాదని తాత్కాలిక ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు గతంలో హసీనా జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు చీఫ్ అడ్వైజర్ కార్యాలయం ప్రకటించింది. అంతేకాదు, భవిష్యత్తులో అధికారులను ఎలా సంబోధించాలన్న దానిపై రివ్యూ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది.
భారతదేశం బంగ్లాదేశ్ను ఎందుకు విడిపించింది?
పాకిస్తాన్ అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవాలనే భారతదేశ నిర్ణయానికి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య గతంలో ఉన్న శత్రు సంబంధాలు తోడయ్యాయి . ఫలితంగా, భారత ప్రభుత్వం ముక్తి బాహినికి మద్దతు ఇవ్వడం ద్వారా జాతి బెంగాలీల కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.
షేక్ హసీనా ఎందుకు రాజీనామా చేశారు?
నెలల తరబడి నిరసనలు కొనసాగాయి, హింసాత్మక అణచివేత మరియు నిరసనకారుల హత్యల తరువాత, హసీనా మరియు ఆమె పరిపాలన నిరసనకారుల ప్రధాన సంస్థ, స్టూడెంట్స్ అగైన్స్ట్ డిస్క్రిమినేషన్, పదవికి రాజీనామా చేయాలని అల్టిమేటం ఇచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: America: భారతీయ విద్యార్థులు, టూరిస్ట్లకు భారీగా వీసా ఫీజు పెంపు