हिन्दी | Epaper

Bangladesh: భారత్ తో ఉద్రిక్తతలను తగ్గించుకుంటే బంగ్లాదేశ్ కే మంచిది: రష్యా

Rajitha
Bangladesh: భారత్ తో ఉద్రిక్తతలను తగ్గించుకుంటే బంగ్లాదేశ్ కే మంచిది: రష్యా

బంగ్లాదేశ్ భారతదేశంతో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని బంగ్లాదేశ్ లోని రష్యా రాయబారి అలెగ్జాండర్ గ్రిగోరియేవిచ్ ఖోజిన్ సూచించారు. భారతదేశంతో ఉద్రిక్తతను ఎంత త్వరగా తగ్గిస్తే బంగ్లాదేశ్ కు అంత మంచిది అని అన్నారు. ఉద్రిక్తతలను తగ్గించుకోవడం రెండు దేశాలకు, మొత్తం దక్షిణాసియాకు చాలా కీలకమని అన్నారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంతో భారత్, రష్యా పోషించిన పాత్రను కూడా అలెగ్జాండర్ గుర్తు చేశారు. 1971లో ప్రధానంగా భారతదేశం సహాయంతో బంగ్లాదేశ్ (Bangladesh) స్వాతంత్ర్యం పొందింది. రష్యా కూడా దీనికి మద్దతు ఇచ్చింది అని ఖోజిన్ అన్నారు.

Read also: Jeffrey Epstein Case: ట్రంప్ మంచోడు.. 30,000 పేజీలను విడుదల చేసిన న్యాయశాఖ

Bangladesh

Bangladesh

ద్వైపాక్షిక సంబంధాలలో రష్యా జోక్యం చేసుకోదు

రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో రష్యా జోక్యం చేసుకోవడం లేదు, అయితే ఉద్రిక్తతను మరింత పెంచకుండా ఉండే మార్గాన్ని వెతకడం తెలివైన పని.. పరస్పర విశ్వాసంపై సంబంధాలు ఆధారపడి ఉండాలి అని అలెగ్జాండర్ గ్రిగోరియేవిచ్ అన్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతపై రష్యా ఇప్పటివరకు మౌనంగా ఉన్నందున రష్యా రాయబారి చేసిన ఈ వ్యాఖ్య కీలకంగా మారింది. నిజానికి, బంగ్లాదేశ్ లోని పాశ్చాత్య దేశాల రాయబార కార్యాలయాలు.. బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమ నేత ఉస్మాన్ హాదీ మరణంపై సంతాపాలు ప్రకటిస్తున్న వేళ రష్యా వారందరికీ భిన్నంగా బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంలో భారత్ పాత్రను ప్రస్తావించింది. తాజాగా బంగ్లాదేశ్ ప్రధాని యూనస్ కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగానే పొరుగు దేశమైన భారత్ తో సంబంధాలు చేజారిపోకుండా చూస్తామని ఆర్థిక స్థిరత్వం కోసం ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తామని బంగ్లాదేశ్ ఆర్థిక సలహాదారు సలేహుద్దీన్ అహ్మద్ స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు..ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు..ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

తన కూతురితో కలిసి క్రూయిజ్ క్షిపణి పరీక్షలను వీక్షించిన కిమ్

తన కూతురితో కలిసి క్రూయిజ్ క్షిపణి పరీక్షలను వీక్షించిన కిమ్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆరోగ్యంపై పెరుగుతున్న ఊహాగానాలు

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆరోగ్యంపై పెరుగుతున్న ఊహాగానాలు

📢 For Advertisement Booking: 98481 12870