భారత్, బంగ్లాదేశ్ పొరుగు దేశాలు. పాకిస్తాన్ లాగా బంగ్లా కూడా దాయాది దేశం. దేశాలు విడిపోయినా స్నేహం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని నెలలుగా ఈ సంబంధానికి బీటలు పడ్డాయి.

బంగ్లాదేశ్లో రాజకీయ మార్పులే దీనికి కారణం
ఆ దేశానికి ప్రధానిగా షేక్ హసినా ఉన్నంతవరకు భారత్ (India) తో బంగ్లాదేశ్ (Bangladesh)కు స్నేహసంబంధాలే కొనసాగాయి. అయితే ఆమెను దేశం నుంచి వెళ్లగొట్టారో, ఆమె ఇండియా వచ్చి తలదాచుకుందో.. అప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. బంగ్లాదేశ్ భారత్పై కత్తికట్టింది. మొహ్మద్ యూనస్ సారధ్యంలో భారత్పై తిరుగుబాటు మొదలైంది. అక్కడ హిందువులపై దాడులు చేశారు. మనదేశానికి సంబంధించిన చరిత్ర ఆనవాళ్లను కూలగొట్టారు. అంతేకాదు మరో రెండు పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో చేతులు కలపడానికి బంగ్లాదేశ్ ప్రయత్నించింది. అక్కడి
నేతలతో తరచూ సంప్రదింపులు జరుపుతూ, వారి దేశాలకు పర్యటనకు వెళుతూ.. భారత్పై అవాకులు, చవాకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ చాలానే చేసింది.
రెండు దేశాలకు చెక్కెట్టిన బంగ్లా
కాగా తాజాగా పాకిస్తాన్, చైనా దేశాలకు బంగ్లాదేశ్ చెక్ పెట్టింది. పాకిస్తాన్, చైనా ఆశను వమ్ముచేస్తూ పెద్ద ప్రకటన చేసింది బంగ్లాదేశ్ (Bangladesh). భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ భూమిని వాడుకోవడానికి ఎప్పటికీ ఒప్పుకోమని తేల్చి చెప్పింది. బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లా (Riyaz Hamidullah) ఈ విషయాన్ని ప్రకటించారు. భారత్, బంగ్లా మధ్య సంబంధాలు దశాబ్దాల నాటివని అవి నమ్మకం, ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలు, సాంస్కృతిక పునాదులపై నిర్మించబడ్డాయని హమీదుల్లా స్పష్టం చేశారు. రెండు దేశాలకు ముప్పు వాటిల్లే పని ఎప్పటికీ చేయమని చెప్పారు. పాకిస్తాన్ లేదా చైనాతో బంగ్లాదేశ్ ప్రవర్తన సైద్ధాతిక మార్పుకు సంకేతమనే భావనను ఆయన తిరస్కరించారు. మైనారిటీలు, హిందువుల మీద జరిగిన దాడులను బట్టి మొత్తం బంగ్లాదేశ్ను నిర్వచించలేరిన హమీదుల్లా స్పష్టం చేశారు. చైనాతో తమ సంబంధం ఆర్థికపరమైనవి మాత్రమేనని ఆయన అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: