ఇరాన్లోని కీలక అణు కేంద్రాలపై అమెరికా తాజాగా B-2 బాంబర్ల(B-2 Bombers)తో భారీ దాడులు చేసింది. ‘ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్’ (Operation Midnight Hammer) పేరుతో నిర్వహించిన ఈ రహస్య మిషన్లో మూడు ప్రధాన అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. వీటిని నిర్వీర్యం చేసేందుకు అత్యాధునిక బాంబులు వాడినట్లు సమాచారం. ఈ దాడి అనంతరం తీవ్ర ప్రభావం ఏర్పడినట్లు భావిస్తున్నారు. ఇది మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముంది.
సురక్షితంగా అమెరికాకు తిరిగిన B-2 బాంబర్లు
ఈ ఆపరేషన్లో పాల్గొన్న B-2 స్టెల్త్ బాంబర్లు తమ మిషన్ విజయవంతంగా ముగించి అమెరికాకు సురక్షితంగా తిరిగివచ్చాయి. మిస్సౌరీ రాష్ట్రంలోని నాబ్ నోస్టర్ పట్టణంలో ఉన్న వైట్మన్ ఎయిర్ఫోర్స్ బేస్కి వీటిని ల్యాండ్ చేశారు. అత్యంత శక్తివంతమైన మరియు గగనతలంలో కనిపించకుండా దాడులు చేయగల ఈ B-2 బాంబర్లు ప్రపంచంలో అత్యున్నతమైన యుద్ధవిమానాలుగా పరిగణించబడుతున్నాయి.
ట్రంప్ ప్రశంసలు – పైలట్లకు ధన్యవాదాలు
ఈ విజయవంతమైన ఆపరేషన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ట్రూత్ సోషల్ ద్వారా చేసిన పోస్టులో “B-2 పైలట్లు సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. గొప్ప పని చేశారు. దేశం తరఫున ధన్యవాదాలు” అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అమెరికాలో హాట్ టాపిక్గా మారాయి. అంతర్జాతీయంగా ఈ దాడిపై తక్షణ స్పందనలు వస్తున్నప్పటికీ, అమెరికా వైఖరి స్పష్టంగా దళసహితంగా ప్రతిస్పందించే విధంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also ; Iran-Israel War: ఇరాన్ పై కొనసాగుతున్న బాంబుల వర్షం