Iran Earthquake: ఇరాన్లో మళ్లీ భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైంది. బందర్ అబ్బాస్కు సుమారు 74 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) అధికారికంగా ధృవీకరించింది. ఈ ప్రకంపనల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read Also: War Effect : రెండేళ్ల గరిష్ఠానికి ఆయిల్ ధరలు!

యుద్ధం ప్రకృతి వైపరీత్యాల నడుమ ఇరాన్
ఈ నెల 3న కూడా గెరాష్ నగర సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిన తెలిసిందే. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా మిస్సైళ్లతో విరుచుకుపడుతున్నాయి.ఈ దాడుల వల్ల ఇరాన్లో ఇప్పటివరకు 1,300 మందికి పైగా మరణించినట్లు సమాచారం. మరోవైపు, ఇరాన్ తన పట్టు నిలుపుకోవడం కోసం గల్ఫ్ దేశాలపై అడపాదడపా డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. అమెరికా మాత్రం ఇరాన్ ‘బేషరతుగా లొంగిపోవాల్సిందే’నని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, ఇది యుద్ధం ముగింపునకు సంకేతమా? లేక భారీ ప్రతిదాడికి ముందు ఇరాన్ వేసిన వ్యూహాత్మక అడుగా? అన్నది అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: