అమెరికా (America) దళాలు వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఆ దేశ చమురు రంగం కూడా అమెరికా కంట్రోల్లోకి వెళ్లనుంది. ఈ విషయాన్ని ట్రంప్ కూడా ప్రకటించారు. దీంతో భారత చమురు రంగానికి ఎలాంటి ప్రభావం ఉంటుందో అనేదానిపై చాలామందికి సందేహం నెలకొంది.
Read also: Bangladesh: బంగ్లాలో హిందూ మహిళపై సామూహిక అత్యాచారం?
అయితే ఈ పరిణామాల వల్ల మనదేశ చమురు కంపెనీలకు లబ్ధి చేకూరనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే భారీమొత్తంలో బకాయిలు వసూలవుతాయని అంచనా వేస్తున్నారు. వెనెజువెలా (Venezuela’s Oil Reserves) చమురు రంగాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటే మన భారత్కు రావాల్సిన 1 బిలియన్ డాలర్ల (రూ.9 వేల కోట్లు) బకాయిలు అందే ఛాన్స్ ఉంటుంది.అక్కడ మన కంపెనీలు నిర్వహిస్తున్న క్షేత్రాల నుంచి ముడిచమురు ఉత్పత్తిని పెంచే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

భారత్ వాణిజ్యంపై అంతగా ఉండదు
గతంలో భారత్కు వెనెజులా అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉండేది. రోజుకు ఏకంగా 4 లక్షల బ్యారెళ్లకు పైగా చమురును అక్కడి నుంచి దిగుమతి చేసుకునేది. 2020లో వెనెజువెలాపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో భారత్ అక్కడి నుంచి చమురు కొనుగోళ్లను ఆపేసింది.అమెరికా-వెనెజులా మధ్య పరిణామాల ప్రభావం భారత్ వాణిజ్యంపై అంతగా ఉండదని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ వెల్లడించింది.
ఆంక్షల తర్వాత వెనెజులాతో భారత వాణిజ్యం భారీగా తగ్గిపోయింది. 2024-25లో ముడిచమురు దిగుమతులు 81.3 శాతానికి పడిపోయాయి. ఇదే సమయంలో వెనెజులా నుంచి దిగుమతులు 364.5 మిలియన్ డాలర్లు (రూ.3280 కోట్లు) మాత్రమే. ఈ సమయంలోనే మన ఎగుమతులు 95.3 మిలియన్ డాలర్లు (రూ.850 కోట్లు)గా ఉంది. అయినప్పటికీ మన ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం అంతగా ఉండదని నిపుణలు చెబుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: