రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్పై అమెరికా America వేశిస్తున్న ఒత్తిడిని తీవ్రంగా విమర్శించారు. భారత్ ఎప్పటికీ బయట దేశాల ఒత్తిళ్లకు తలొగ్గదని, ఎలాంటి అవమానాన్ని కూడా అనుమతించనని స్పష్టంగా చెప్పారు. పుతిన్ ఈ వ్యాఖ్యలను సోచిలోని వాల్డాయ్ అంతర్జాతీయ చర్చా వేదికలో 140 దేశాల భద్రతా, భౌగోళిక రాజకీయ నిపుణుల సమక్షంలో చేశారు. పుతిన్ తెలిపిన వివరాల ప్రకారం, “ప్రధాని నరేంద్ర మోదీ నా స్నేహితుడు. ఆయన నాయకత్వంలో భారత్ ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగదు. అమెరికా మాట వినడం వల్ల రష్యా నుంచి ఇంధనం కొనడం ఆపితే, భారత్ సుమారుగా 9–10 బిలియన్ డాలర్ల వరకు నష్టపోతుంది” అని పేర్కొన్నారు.
Israel Attack Gaza : గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 57 మంది మృతి

అదేవిధంగా, అమెరికా America విధించే చర్యలు ఆ దేశానికి మాత్రమే నష్టం కలిగిస్తాయని, ప్రపంచ ఇంధన ధరలు పెరిగి అమెరికా ఫెడరల్ రిజర్వ్పై ఒత్తిడిని పెంచి వడ్డీ రేట్లను ఎక్కువ చేస్తాయని పుతిన్ Vladimir Putin హెచ్చరించారు. వాణిజ్య లోటును తగ్గించేందుకు రష్యా భారత్తో మరిన్ని చారిత్రక ఒప్పందాలను పరిశీలిస్తోందని, భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు అధికంగా కొనుగోలు చేసే అవకాశాలను పుతిన్ చెప్పారు. డిసెంబర్లో భారత పర్యటనలో పలు చర్చలు జరగనున్నట్లు ఆయన తెలిపారు.
ఇంతకుముందు, అమెరికా ద్వంద్వనీతిని పుతిన్ విమర్శించారు. “అణు విద్యుత్ కోసం అమెరికాకు పెద్ద మొత్తంలో ఇంధనం అవసరం. రష్యా ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ, ఓ వైపు మా నుంచి యురేనియం కొనుగోలు చేస్తూ, మరోవైపు భారత్పై ఒత్తిడిని పెడుతోంది. ఇది వారి ద్వంద్వ విధానానికి నిదర్శనం” అని తెలిపారు
పుతిన్ ఏ దేశంపై ఒత్తిడిని విమర్శించారు?
పుతిన్ భారత్పై అమెరికా వేశిస్తున్న ఒత్తిడిని తీవ్రంగా విమర్శించారు.
పుతిన్ ప్రకారం, భారత్ ఏ కారణంగా ఒత్తిళ్లకు తలొగ్గదు?
ఆయన ప్రకారం, భారత్ ఎప్పటికీ బయట దేశాల ఒత్తిళ్లకు తలొగ్గదు మరియు ఎలాంటి అవమానాన్ని అనుమతించదు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: