వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య అమెరికా సైన్యం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శనివారం తెల్లవారుజమున పెద్ద ఎత్తున సైనిక దాడి చేసి మదురోను అదుపులోకి తీసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తగా మారాయి. ప్రపంచదేశాలన్ని ఈ హఠాత్తు పరిణామాలకు నివ్వెరపోయాయి. ఇంకా ఈ షాక్ నుంచి తేరుకోకముందే వెనిజులా అధ్యక్షుడు మదురో ఆయన భార్యను అదుపులో తీసుకుని, వెనిజులా వెలుపలికి వారిని తీసుకొచ్చారు. అంతేకాక ట్రంప్ (Trump) వెనిజులా ప్రజలతో కలిసి పనిచేస్తామని, ఆ దేశప్రజల యోగక్షేమాలే తమకు ముఖ్యమని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇక నికోలస్ మదురోను అమెరికాకు తీసుకెళ్లిపోవడంతో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోనరడిస్ట్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టగానే ఆమెరికా చర్యలను ఆమె తప్పుపట్టారు. మదురోను నిర్బంధించడం సరికాదని, వెంటనే విడిచిపెట్టాలని ఆమె డిమాంద్ చేశారు.

Read also: Monkeys: చైనాలో కోతులకు పెరుగుతున్న డిమాండ్.. కారణాలేంటి?
మదురో కంటే ఘోరమైన గతి పడుతుంది
తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందించారు. వెనిజులా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అమెరికా చేయాలనుకుంటున్న పనులను చేసేందుకు డెల్సీ రోడ్రిగ్ సుముఖంగా ఉండాలన్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఆమె సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మదురో కంటే ఘోరమైన గతి పడుతుందన్నారు. వెనిజులాపై అమెరికా నియంత్రణకు అంగీకరించాల్సిందేనని.. అప్పుడే ఆ దేశాన్ని పునర్నిర్మించగలమని చెప్పారు. తాము చెప్పినట్లు చేస్తే వెనిజులాలో అమెరికా దళాలు మోహరించబోవు అని ట్రంప్ తేల్చిచెప్పారు. వెనిజులా దేశప్రజలకు ఏం కావాలో తమకు తెలుసని, వారితో కలిసి పనిచేస్తామని ట్రంప్ ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: