हिन्दी | Epaper

తుర్కియే రాజధానిలో ఉగ్రదాడి

Sudheer
తుర్కియే రాజధానిలో ఉగ్రదాడి

తుర్కియే రాజధాని అంకారాలో తీవ్ర ఉగ్రదాడి ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడి టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (TAI) కహ్రమన్‌కాజాన్ ఫెసిలిటీలో జరిగింది. ఉగ్రవాదులు సాయుధంగా ప్రవేశించి, భద్రతా సిబ్బంది డ్యూటీ మార్పిడి సమయంలో ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 14 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది.

ప్రవేశ ద్వారం వద్ద ఒక వ్యక్తి బాంబు పేల్చినట్లు సమాచారం, ఈ సమయంలో మిగతా ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించారు. దాడి తర్వాత భద్రతా బలగాలు రంగంలోకి దిగడంతో కాల్పులు కూడా జరిగినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు ఈ దాడికి బాధ్యత ఎవరు తీసుకోలేదని అధికారులు తెలిపారు.
ఈ దాడిని టర్కిష్ ఇంటీరియర్ మినిస్టర్ అలీ యెర్లికాయ మరియు వాణిజ్య మంత్రి ఉమర్ బోలాట్ ఖండించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870