हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

జమిలి ఎన్నికలఫై రామ్నాథ్ కోవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు

Sudheer
జమిలి ఎన్నికలఫై రామ్నాథ్ కోవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారతదేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పులు సంభవిస్తాయని, GDP 1%-1.5% వృద్ధి చెందుతుందని జమిలి ఎన్నికల కమిటీ ఛైర్మన్ రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఆర్థిక నిపుణులు చేసిన అధ్యయనాల ప్రకారం జమిలి ఎన్నికల వల్ల తక్షణ ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని ఆయన తెలిపారు. జమిలి ఎన్నికల విధానం దేశ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఉన్నదని, ఈ విధానం ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రయోజనాలను ప్రతిబింబించేది కాదని, ప్రజల సమగ్ర అభివృద్ధికి దోహదం చేసేలా ఉంటుందని కోవింద్ పేర్కొన్నారు. అందుకే జమిలి ఎన్నికల ఆలోచనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

జమిలి ఎన్నికలు చట్టరూపం దాల్చితే, దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని, ప్రభుత్వ యంత్రాంగంపై ఉన్న ఒత్తిడిని తగ్గించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక జమిలి ఎన్నికల అనంతరం 100 రోజుల్లోనే మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విధానం అమల్లోకి వస్తుందని కోవింద్ వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ ఒక సమన్వయ పద్ధతిలో ఉంటే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలపై కేంద్రం తీసుకునే నిర్ణయం రాజకీయ పార్టీలు, ప్రజల మధ్య చర్చకు దారితీయనుంది. దీని వల్ల దేశ రాజకీయ వ్యవస్థలో సుదీర్ఘ కాలానికీ ప్రభావం చూపే మార్పులు సంభవించే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870