Inter classes from April 1. Holidays will be shortened

ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ క్లాసులు.. సెలవులు కుదింపు

అమరావతి: ఏపీ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌లో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను, సీబీ ఎస్‌ఈ విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే సెకండియర్ తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ తో పోటీ పరీక్షలకు సంబంధించి ఏప్రిల్ 22వ తేదీ వరకు క్లాసులు నిర్వహించనుంది.అకడమిక్‌తో పోటీ పరీక్షలకు సంబంధించి 22వ తేదీ వరకు క్లాసులు.ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ క్లాసులు.. సెలవులు కుదింపు.

ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ క్లాసులు
ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ క్లాసులు

తొలి 23 రోజుల్లో దాదాపుగా 15 శాతం సిలబస్‌

ఏప్రిల్‌ 5 నుంచి మొదటి సంవత్సరం ప్రవేశాలు చేపడతారు. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఇవ్వనుంది. గతంలో పరీక్షల పూర్తయిన వెంటనే సెలవులు ఇస్తుండగా ఇకపై వాటిని కుదించనుంది. తొలి 23 రోజుల్లో దాదాపుగా 15 శాతం సిలబస్‌ పూర్తిచేసి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఇంటర్ విద్యలో సాధ్యాసాధ్యాలు, అమలు చేయాల్సిన మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు12 రాష్ట్రాల్లో పర్యటించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ మార్పులకు శ్రీకారం చుట్టాయి.

ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు రిలీజ్

ఇక రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. 2025 మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సెంకడియర్ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా ఇంటర్ హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే.. ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ ‘https://bie.ap.gov.in/’ ద్వారా కూడా విద్యార్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌ నంబర్ 9552300009 ద్వారా AP Inter Hall Ticket డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Related Posts
కుంభమేళాలో 60 కోట్ల మంది పుణ్యస్నానం – యోగి
Situation in Prayagraj under control.. CM Yogi

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచిన మహాకుంభమేళా ఈసారి విశేష జనసందోహాన్ని కలిగి ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు Read more

వైస్ షర్మిల కు వార్నింగ్ ఇచ్చిన కళ్యాణి
sharmila dharna

కడప జిల్లాకు చెందిన వైసీపీ సోషల్ మీడియా వర్కర్ వర్రా రవీంద్రారెడ్డి భార్య కల్యాణి.. వైఎస్ షర్మిళను తీవ్రస్థాయి లో హెచ్చరించారు. కడప జిల్లా పోలీసులు వర్రా Read more

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు..ఉదయం 9 గంటల వరకూ 6.61 శాతం పోలింగ్‌..
Maharashtra and Jharkhand assembly elections. 6.61 percent polling till 9 am

ముంబయి: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. జార్ఖండ్ విషయంలో కొంత ప్రశాంతత ఉండగా.. మహారాష్ట్రలో మాత్రం ఎన్నికల రోజున కూడా రాజకీయ హడావుడి కనిపిస్తోంది. Read more

ఢిల్లీలో భూకంపం
delhi earthquake feb17

ఉదయం స్వల్ప భూకంపం ఢిల్లీలో భూకంపం.దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతగా నమోదైనట్లు భూకంప పరిశీలన కేంద్రాలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *