Inquiry on petitions of Telangana and AP IAS in CAT today

నేడు క్యాట్‌లో తెలంగాణ, ఏపీ ఐఏఎస్‌ల పిటిషన్ల పై విచారణ

హైదరాబాద్‌: కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశాలతో తెలంగాణ, ఆంధ్రాలో కొనసాగుతున్న ఐఏఎస్,ఐపీఎస్‌ కేడర్​ అధికారులు పునర్విభజన యాక్ట్​ ప్రకారం తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్‌ చేయాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం (డీఓపీటీ) ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు డీఓపీటీ కార్యదర్శి ఆర్డర్స్​ సైతం జారీ చేశారు. ఈ క్రమంలోనే డీఓపీటీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఏపీ, తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్‌లు క్యాట్‌ను ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై క్యాట్‌లో మంగళవారం విచారణ జరగనుంది.

గతంలో ఏపీకి కేటాయించి ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌ ఆఫీసర్స్​ వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్‌ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతి, ఐపీఎస్‌ కేడర్ అంజనీ కుమార్, అభిలాశ్​ బిస్త్, అభిషేక్‌ మహంతి ఉన్నారు. ఇక ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన వారిలో ఐఏఎస్‌ ఆఫీసర్లు సృజన, శివశంకర్, హరికిరణ్‌ ఉన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లేందుకు అప్లికేషన్​ పెట్టుకున్న ఎస్‌.ఎస్‌.రావత్, అనంతరాము అభ్యర్థనలను డీవోపీటీ రిజక్ట్​ చేసింది. దీంతో వీరిద్దరూ ఏపీలోనే కొనసాగనున్నారు. కాగా, క్యాట్ ఐఏఎస్‌ల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటుందా? లేదా అనేది నేడు తేలనుంది.

Related Posts
తెలంగాణ లో మందుబాబులకు కిక్కు పెంచే న్యూస్
kicks drug addicts in Telan

తెలంగాణలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉత్పత్తిదారులు, సరఫరాదారులు ధరల పెంపుపై ప్రతిపాదనలు చేసినప్పటికీ, ప్రభుత్వం వాటిని అంగీకరించలేదు. సాధారణంగా, Read more

నేటి నుండి ట్రాఫిక్‌ విధుల్లో ట్రాన్స్‌జెండర్లు
Transgender on traffic duty from today

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగంలో సోమవారం నుంచి ట్రాన్స్‌జెండర్లు విధులు నిర్వహించనున్నారని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని కమాండ్‌ అండ్‌ Read more

తిరుమలలో భక్తులను అప్రమత్తం చేసిన చిరుత
తిరుమలలో భక్తులను అప్రమత్తం చేసిన చిరుత

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఈ రోజు సాయంత్రం, తిరుమల శిలాతోరణం వద్ద చిరుతపులి సంచరిస్తున్నట్లు పలువురు భక్తులు గుర్తించారు. ఈ గమనికతో, వారు Read more

AP Cabinet : నేడు ఏపీ క్యాబినెట్ భేటీ
Cabinet approves AP Annual Budget

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రులు సమావేశమై రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన విధానాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ Read more