Indian Parliament ఎంపీల జీతం రూ.1 లక్ష నుంచి లక్షలకు పెంపు

Indian Parliament : ఎంపీల జీతం రూ.1 లక్ష నుంచి లక్షలకు పెంపు

Indian Parliament : ఎంపీల జీతం రూ.1 లక్ష నుంచి లక్షలకు పెంపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యుల వేతనాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.తాజాగా ఎంపీల జీతాలు, అలవెన్సులు, పింఛన్లను సవరించేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ పెంపు 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల నెల జీతం రూ.1 లక్ష నుంచి రూ.1.24 లక్షలకు పెరిగింది. అలాగే, రోజువారీ భత్యం రూ.2,000 నుంచి రూ.2,500కు పెంచారు.మాజీ ఎంపీల పింఛన్ కూడా పెరిగి, రూ.25,000 నుండి రూ.31,000కు చేరుకుంది.ఐదేళ్ల సర్వీసు తర్వాత అదనంగా లభించే పింఛన్ రూ.2,000 నుండి రూ.2,500కి పెంచారు. పార్లమెంటు సమావేశాల సమయంలోనే ఈ పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Indian Parliament ఎంపీల జీతం రూ.1 లక్ష నుంచి లక్షలకు పెంపు
Indian Parliament ఎంపీల జీతం రూ.1 లక్ష నుంచి లక్షలకు పెంపు

2018లో చివరిసారిగా ఎంపీల వేతనాల్లో మార్పులు చేశారు. ఆ సమయంలో ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని, ఎంపీల మూల వేతనం రూ.1 లక్షగా నిర్ణయించారు. అప్పటి నుంచి ఎంపీలకు కార్యాలయ నిర్వహణ, ఓటర్లతో సంబంధాలు కొనసాగించేందుకు నియోజకవర్గ భత్యంగా రూ.70,000, కార్యాలయ నిర్వహణ ఖర్చుల కోసం రూ.60,000, రోజువారీ భత్యంగా రూ.2,000 లభించేవి.తాజా సవరణ ప్రకారం, వీటిని కూడా పెంచనున్నారు. ఎంపీలకు ఫోన్, ఇంటర్నెట్ వినియోగానికి ప్రత్యేక భత్యం లభిస్తుంది.వార్షికంగా 34 ఉచిత దేశీయ విమాన ప్రయాణాలు, ఎప్పుడైనా ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే మైలేజ్ అలవెన్స్ పొందే వీలుంటుంది.

అంతేకాకుండా సంవత్సరానికి 50,000 యూనిట్ల ఉచిత విద్యుత్, 4,000 కిలోలీటర్ల ఉచిత నీరు అందజేస్తారు. ఎంపీల ఐదేళ్ల పదవీకాలంలో ఢిల్లీలో అద్దె లేని నివాస సౌకర్యం లభిస్తుంది.సీనియారిటీ ఆధారంగా హాస్టల్ గదులు, అపార్ట్‌మెంట్లు లేదా బంగ్లాలు కేటాయిస్తారు. అయితే అధికారిక వసతిని ఉపయోగించకూడదనుకునే ఎంపీలు, నెలవారీ గృహ అద్దె భత్యం పొందే అర్హత కలిగి ఉంటారు. నూతన వేతనాలు భత్యాల పెంపుతో ఎంపీల జీవిత విధానం మరింత లాభదాయకంగా మారనుంది.అయితే ప్రజలకు సేవ చేయడంలో ఈ పెంపు ఎంతవరకు ప్రభావం చూపిస్తుందనేది గమనించాల్సిన విషయం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related Posts
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Fatal road accident. Six killed

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. అలాగే మరో వ్యక్తికి Read more

రూ .2.98 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్..
Assembly meeting from today. Cabinet approves AP budget

అమరావతి: ఈరోజు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జె‌ను ప్రవేశపెట్టనున్నారు. సుమారు రూ. 2.9 లక్షల కోట్లతో Read more

Chandrababu : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu visits Tirumala temple

Chandrababu : ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. తన మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన Read more

ఈ నెల 25న బీజేపీ భారీ ధర్నా
BJP will hold a huge dharna

హైడ్రా, మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా ఈ నెల 25న భారీ ధర్నా చేపడతామని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ తెలిపారు. బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *