భారత మహిళా క్రికెట్ జట్టు మలేషియాతో జరిగిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసి వారిని తక్కువ స్కోర్కే పరిమితం చేసింది. భారత స్పిన్నర్ల దాడికి మలేషియా బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా కూలిపోయింది.మలేషియా జట్టు కేవలం 22 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 17 బంతుల్లోనే చేజిక్కించుకోవడం గమనార్హం.అయితే ఈ మ్యాచ్లో ఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది, అది నో బాల్పై మలేషియా బ్యాటర్ ఔట్ కావడం.మలేషియాపై బౌలింగ్ చేసిన భారత స్పిన్నర్లు విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో మలేషియా బ్యాటర్ నుని ఫారిని సఫ్రీని జోషిత ఔట్ చేసింది.అయితే నాల్గవ ఓవర్లో విచిత్రమైన సన్నివేశం జరిగింది.
మలేషియా వికెట్ కీపర్ నూర్ అలియా, వ్యక్తిగతంగా 5 పరుగుల వద్ద, నో బాల్పై రనౌట్ అయింది.ఆ లెగ్ నో బాల్కు షాట్ ఆడిన ఆమె, పరుగు కోసం పిచ్పై ముందుకెళ్లగా, భారత ప్లేయర్ పరుణికా సిసోడియా ఆమెను రనౌట్ చేసింది.ఇది మ్యాచ్లో ఆసక్తికర మలుపుగా నిలిచింది.నూర్ అలియా ఔట్ అయిన వెంటనే, మలేషియా జట్టు మరింత బలహీనమైంది.మలేషియా జట్టు రనౌట్ తర్వాత కొద్ది సేపటికే వరుస వికెట్లు కోల్పోయింది.6 బంతుల్లో మూడు వికెట్లు పడిపోయాయి. భారత బౌలర్ ఆయుషి శుక్లా రెండు కీలక వికెట్లు తీసి మలేషియా జట్టును దిగజార్చింది. హుస్నా, సఫికా, కెప్టెన్ నూర్ డానియా, నురిమాన్ హిదయా వెంటవెంటనే ఔట్ అయ్యారు. ఈ పరిణామాలతో 10 ఓవర్లకు ముందే మలేషియా జట్టు 6 వికెట్లు కోల్పోయింది.ఈ మ్యాచ్ భారత జట్టుకు పెద్దగా కష్టమేమీ కాలేదు. మలేషియాపై 9 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. తొలి మ్యాచ్లోనూ భారత జట్టు తన ప్రాభవాన్ని చాటింది. అంతేకాదు, వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లోనూ ఘన విజయం సాధించింది.భారత జట్టు విజయవంతమైన ప్రదర్శనతో తమ జైత్రయాత్ర కొనసాగిస్తోంది.