జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడికి భారత ప్రభుత్వం గట్టి సమాధానం ఇచ్చింది.ఆ సమాధానమే ‘ఆపరేషన్ సింధూర్‘. ఈ ఆపరేషన్లో భారత సాయుధ దళాలు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయి.పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)తో పాటు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో 9 కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు.ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులు లక్ష్యంగా మారారు.అందులో సుమారు 80 మంది ముష్కరులు మృతిచెందినట్లు సమాచారం.బహవల్పూర్లోని జైషే అధినేత మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది కూడా హతమయ్యారు.ఈ ఆపరేషన్లో భారత వాయుసేన అత్యాధునిక ఆయుధాలను వినియోగించింది.రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా స్కాల్ప్ మరియు హామర్ క్షిపణులను ప్రయోగించారు.స్కాల్ప్ క్షిపణిని ‘స్టార్మ్ షాడో’ అని కూడా పిలుస్తారు.

ఇది శత్రు రాడార్లకు చిక్కకుండా పనిచేసే స్టెల్త్ టెక్నాలజీ కలిగినది. 450 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితంగా ఛేదిస్తుంది.దీనిలో INS, GPS, భూమి సంకేతాల ఆధారంగా నావిగేషన్ వ్యవస్థ ఉంటుంది. లక్ష్యానికి చేరుకున్నప్పుడు, దీని ఇన్ఫ్రారెడ్ సీకర్ తేలికగా టార్గెట్ను గుర్తిస్తుంది. ఇది గోడల లోపలికీ చొచ్చుకుపోయే శక్తి కలిగిన క్షిపణి.ఆపరేషన్లో మరో కీలక హథియార్ హామర్ బాంబ్. ఇది ఫ్రాన్స్ కంపెనీ ‘సఫ్రాన్’ తయారుచేసింది. గ్లైడ్ బాంబ్గా పేరుగాంచిన ఈ ఆయుధం 70 కిలోమీటర్ల దూరం వరకు ప్రయోగించవచ్చు.హామర్ 250, 500 లేదా 1000 కిలోల వార్ హెడ్తో వస్తుంది. ఇది ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేస్తుంది. దాన్ని అడ్డుకోవడం శత్రువులకు చాల కష్టం.గట్టిపడిన భవనాల్లోకి సైతం చొచ్చుకుపోయే సామర్థ్యం దీని ప్రత్యేకత. భారత్ ఈ బాంబుతో జైషే మరియు లష్కరే స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది.ఈ దాడులతో భారత్ తీవ్రమైన హెచ్చరిక పంపింది. ఉగ్రవాదం ఎక్కడ నుంచి వచ్చినా, దానికి గట్టి సమాధానం ఇస్తామని తెలిపింది.
Read Also : మోదీని భారత్ ను అంతం చేస్తాం: మసూద్ అజహర్ చూస్తాం చేస్తాం