India imposes 150 percent tariff on American liquor: White House

అమెరిక‌న్ మ‌ద్యంపై భార‌త్ 150 శాతం సుంకం: వైట్‌హౌజ్

న్యూయార్క్ : భారత్‌పై శ్వేత సౌధం కీల‌క ఆరోప‌ణ చేసింది. అమెరికా మ‌ద్యం, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌పై భార‌త్ అధిక స్థాయిలో సుంకాలు వ‌సూల్ చేస్తున్న‌ట్లు చెప్పింది. అమెరిక‌న్ మ‌ద్యంపై భార‌త్ 150 శాతం దిగుమ‌తి సుంకాన్ని వ‌సూల్ చేస్తున్న‌ట్లు వైట్‌హౌజ్ ప్రెస్ కార్య‌ద‌ర్శి క‌రోలిన్ లివిట్ తెలిపారు. అమెరికా వ‌స్తువుల‌పై వివిధ దేశాలు విధిస్తున్న సుంకాల‌కు సంబంధించిన గ‌ణాంక వివ‌రాల‌ను ఆమె వైట్‌హౌజ్‌లో మీడియాకు వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా మ‌ద్యంపై ఇండియా భారీగా సుంకాన్ని వ‌సూల్ చేస్తుంద‌న్నారు.

అమెరిక‌న్ మ‌ద్యంపై భార‌త్ 150

బ‌ట‌ర్‌పై 300 శాతంకెన‌డా సుంకం

కెన‌డాతో జ‌రుగుతున్న ట్రేడ్ వార్ గురించి ప్ర‌శ్న వేయ‌గా ఆమె ఇండియాపై కూడా రియాక్ట్ అయ్యారు. అమెరికాను, దేశానికి చెందిన హార్డ్ వ‌ర్కింగ్ అమెరిక‌న్ల‌ను కూడా కెన‌డా మోసం చేస్తోంద‌న్నారు. అమెరికా ప్ర‌జ‌లు, వ‌ర్క‌ర్ల‌పై కెన‌డా స‌ర్కారు అత్య‌ధిక స్థాయిలో టారిఫ్‌లు వ‌సూల్ చేస్తున్న‌ట్లు ప్రెస్ సెక్ర‌ట‌రీ ఆరోపించారు. కెన‌డా, భార‌త్‌, జ‌పాన్ లాంటి దేశాలు వ‌సూల్ చేస్తున్న సుంకాల‌కు చెందిన ఛార్ట్‌ను ఆమె ప్ర‌జెంట్ చేశారు. అమెరికాకు చెందిన చీజ్‌, బ‌ట‌ర్‌పై 300 శాతం సుంకాన్ని కెన‌డా వ‌సూల్ చేస్తున్న‌ట్లు ఆరోపించారు.

ఎలాంటి ఒప్పందం కుదరలేదు

భారత్ అధిక సుంకాలు అమలు చేస్తున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ గత కొన్ని రోజులుగా విమర్శలను వ్యక్తం చేస్తున్నారు. భారత్ తన సుంకాలను గణనీయంగా తగ్గించడానికి అంగీకరించిందని ఆయన ఇటీవల పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్‌పై గణనీయమైన సుంకాలను విధిస్తుందనే తన వాదనను పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, వాణిజ్య సుంకాల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ సోమవారం పార్లమెంటరీ ప్యానెల్ కు తెలిపారు.

Related Posts
15 లక్షల విలువైన హనుమాన్ విగ్రహం మాయం – భక్తుల నిరసన
హనుమాన్ దేవాలయంలో అర్థరాత్రి దొంగల హల్‌చల్ – 15 లక్షల వెండి విగ్రహం అపహరణ

హనుమాన్ దేవాలయంలో అర్థరాత్రి దొంగల హల్‌చల్ – 15 లక్షల వెండి విగ్రహం అపహరణ తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్టు మండలం ఫిగ్లిపురం Read more

ఒహియో గవర్నర్ పోటీలో వివేక్ రామస్వామి
ఒహియో గవర్నర్ పోటీలో వివేక్ రామస్వామి

వైట్ హౌస్‌లో కొత్త ప్రభుత్వ సామర్థ్య కార్యాలయానికి నాయకత్వం వహించడానికి ఎంపికైన వివేక్ రామస్వామి, ఇప్పుడు ఒహియో గవర్నర్ పదవికి పోటీ చేయడానికి వారు సిద్ధమవుతున్నారు. అందుకే, Read more

జగన్ పచ్చి అబద్దాలు ఆడుతున్నాడు – అచ్చెన్నాయుడు
jagan mirchi

రైతులకు మేలు చేయని వ్యక్తి జగన్ జగన్ వ్యాఖ్యలకు ప్రజలు నవ్వులు గుంటూరు మిర్చి యార్డు వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ సీఎం జగన్ పై రాష్ట్ర Read more

శంషాబాద్‌‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
Bomb threat to Shamshabad Airport

హైదరాబాద్‌: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. గురువారం ఉదయం ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సైబరాబాద్ కంట్రోల్‌రూమ్‌కు ఓ ఆగంతకుడుకు ఫోన్ చేసి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *