India imposes 150 percent tariff on American liquor: White House

అమెరిక‌న్ మ‌ద్యంపై భార‌త్ 150 శాతం సుంకం: వైట్‌హౌజ్

న్యూయార్క్ : భారత్‌పై శ్వేత సౌధం కీల‌క ఆరోప‌ణ చేసింది. అమెరికా మ‌ద్యం, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌పై భార‌త్ అధిక స్థాయిలో సుంకాలు వ‌సూల్ చేస్తున్న‌ట్లు చెప్పింది. అమెరిక‌న్ మ‌ద్యంపై భార‌త్ 150 శాతం దిగుమ‌తి సుంకాన్ని వ‌సూల్ చేస్తున్న‌ట్లు వైట్‌హౌజ్ ప్రెస్ కార్య‌ద‌ర్శి క‌రోలిన్ లివిట్ తెలిపారు. అమెరికా వ‌స్తువుల‌పై వివిధ దేశాలు విధిస్తున్న సుంకాల‌కు సంబంధించిన గ‌ణాంక వివ‌రాల‌ను ఆమె వైట్‌హౌజ్‌లో మీడియాకు వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా మ‌ద్యంపై ఇండియా భారీగా సుంకాన్ని వ‌సూల్ చేస్తుంద‌న్నారు.

అమెరిక‌న్ మ‌ద్యంపై భార‌త్ 150

బ‌ట‌ర్‌పై 300 శాతంకెన‌డా సుంకం

కెన‌డాతో జ‌రుగుతున్న ట్రేడ్ వార్ గురించి ప్ర‌శ్న వేయ‌గా ఆమె ఇండియాపై కూడా రియాక్ట్ అయ్యారు. అమెరికాను, దేశానికి చెందిన హార్డ్ వ‌ర్కింగ్ అమెరిక‌న్ల‌ను కూడా కెన‌డా మోసం చేస్తోంద‌న్నారు. అమెరికా ప్ర‌జ‌లు, వ‌ర్క‌ర్ల‌పై కెన‌డా స‌ర్కారు అత్య‌ధిక స్థాయిలో టారిఫ్‌లు వ‌సూల్ చేస్తున్న‌ట్లు ప్రెస్ సెక్ర‌ట‌రీ ఆరోపించారు. కెన‌డా, భార‌త్‌, జ‌పాన్ లాంటి దేశాలు వ‌సూల్ చేస్తున్న సుంకాల‌కు చెందిన ఛార్ట్‌ను ఆమె ప్ర‌జెంట్ చేశారు. అమెరికాకు చెందిన చీజ్‌, బ‌ట‌ర్‌పై 300 శాతం సుంకాన్ని కెన‌డా వ‌సూల్ చేస్తున్న‌ట్లు ఆరోపించారు.

ఎలాంటి ఒప్పందం కుదరలేదు

భారత్ అధిక సుంకాలు అమలు చేస్తున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ గత కొన్ని రోజులుగా విమర్శలను వ్యక్తం చేస్తున్నారు. భారత్ తన సుంకాలను గణనీయంగా తగ్గించడానికి అంగీకరించిందని ఆయన ఇటీవల పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్‌పై గణనీయమైన సుంకాలను విధిస్తుందనే తన వాదనను పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, వాణిజ్య సుంకాల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ సోమవారం పార్లమెంటరీ ప్యానెల్ కు తెలిపారు.

Related Posts
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ సవరణకు కేంద్రం ఆమోదం
polavaram

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం అంచనా సవరణకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు 41.15 మీటర్ల వరకు నీరు నిలిపేందుకు సవరించిన Read more

రాత్రిపూట నేలపై పడుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Sleeping on the floor

వేసవి కాలం వచ్చినప్పుడు, ఉక్కబోత వేడి, పరుపు నుంచి కూడా వచ్చే వేడి కారణంగా, రోజంతా శరీరం అలసిపోయినప్పుడు, సాధారణ మంచంలో నిద్ర పోవడం కంటే చల్లటి Read more

హైదరాబాద్‌లో రైల్వే టెర్మినల్ ను ప్రారంభించనున్న మోదీ
హైదరాబాద్‌లో రైల్వే టెర్మినల్ ను ప్రారంభించనున్న మోదీ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు హైదరాబాద్ లోని చార్లపల్లి రైల్వే టెర్మినల్ ను వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ Read more

ఇండోనేషియా అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు
Prabowo Subianto

రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఇండోనేసియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు భారత్‌తో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయని ఆయన.. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *