భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో కీలక పర్యటనపై క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తాజాగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలో ఉన్న పురుషుల వన్డే జట్టుతో పాటు, భారత మహిళా క్రికెట్ జట్టు కూడా వచ్చే ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై బరిలోకి దిగనుంది. వన్డేలు, టీ20లు, టెస్ట్ మ్యాచ్లతో కూడిన ఈ సిరీస్ ఇరుదేశాల మధ్య పోటీ స్థాయిని మరింత పెంచబోతోందని అంచనా. అయితే, ఈ పర్యటనలో భాగంగా ముందుగా మెల్బోర్న్లో జరగాల్సిన ఒక మ్యాచ్ను వేరే వేదికకు మార్చినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
మెల్బోర్న్లోని జంక్షన్ ఓవల్ స్టేడియంలో వచ్చే ఏడాది మూడు వన్డేల్లో రెండవ మ్యాచ్ జరగాల్సి ఉంది.కానీ,రెండవ వన్డేను హోబర్ట్ (Hobart cricket stadium) లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. హోబర్ట్లోని బ్లండ్స్టోన్ అరెనా ఇప్పటికే అనేక అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన వేదిక కావడంతో, మ్యాచ్ సాఫీగా నిర్వహించగలమన్న నమ్మకం ఉందని CA తెలిపింది.భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో రెండవ మ్యాచ్ మెల్బోర్న్లోని జంక్షన్ ఓవల్ మైదానంలో జరగాల్సి ఉంది.
కొత్త ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేయరు
కానీ, అప్పటికి ఈ మైదానంలో కొత్త ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేయరు. దీని కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ను హోబర్ట్కు మార్చింది. క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ పీటర్ రోచ్ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ను జంక్షన్ ఓవల్ నుంచి తరలించాల్సి రావడం, ఈ సీజన్లో మెల్బోర్న్లో మహిళల అంతర్జాతీయ మ్యాచ్లు జరగకపోవడం మాకు నిరాశ కలిగించింది. ఈ మ్యాచ్కు చాలా వారాల ముందే జంక్షన్ ఓవల్లోని లైట్లు ఏర్పాటు చేస్తారని మేమందరం ఊహించాం. మైదానంలో లైట్ల వెలుగులో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ (International match) ను నిర్వహించాలని ఎదురుచూస్తున్నాం.
కానీ అది ఇకపై సాధ్యం కాదు’ అని తెలిపాడు.2026లో భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటన గురించి మాట్లాడుకుంటే, ఇది మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆడుతుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్ల ODI సిరీస్, తరువాత ఒకే టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ పర్యటనలో మొదటి టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 15న జరుగుతుంది. చివరి టెస్ట్ మ్యాచ్ మార్చి 6న జరుగుతుంది. కానీ, దీనికి ముందు, భారత మహిళా జట్టు స్వదేశంలో జరిగే 2025 వన్డే ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకోవాలని కోరుకుంటుంది.
Read hindi news:hindi.vaartha.com
Read Also: