సికింద్రాబాద్ మరియు విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్ (Vande Bharat) ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికుల నుంచి విశేష స్పందనను పొందుతోంది. రోజు రోజుకూ పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ రైలుకు అదనంగా 4 కోచ్లు కలిపారు. ఇప్పటివరకు 14 ఏసీ ఛైర్ కార్ కోచ్లు ఉండగా, వాటిని 18కి పెంచినట్లు రైల్వే శాఖ తెలిపింది.
పూర్తి షెడ్యూల్ వివరాలు
సికింద్రాబాద్ నుంచి ఉదయం 5:05 గంటలకు బయల్దేరే వందేభారత్ ఎక్స్ప్రెస్ (Visakhapatnam Vande Bharat Express) (20707) మధ్యాహ్నం 1:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అక్కడ నుండి తిరుగు ప్రయాణంగా మధ్యాహ్నం 2:30 గంటలకు బయల్దేరే ట్రైన్ (20708) రాత్రి 11:00 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. వేగవంతమైన ప్రయాణానికి అందుబాటులో ఉండే ఈ వందేభారత్ రైలు సమయ పరంగా కూడా ప్రయాణికులకు అనుకూలంగా మారుతోంది.
ప్రయాణికుల కోసం మెరుగైన సదుపాయాలు
కోచ్లు పెంపుతో ప్రయాణికుల సంఖ్య పెరగనుండటంతో, టికెట్లు పొందడానికి మెరుగైన అవకాశం లభించనుంది. అధునాతన సౌకర్యాలతో కూడిన వందేభారత్ రైలు, ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణానుభవాన్ని అందిస్తోంది. కోచ్ల పెంపుతో ప్రజలకు మరింత అనుకూలత కలుగుతుందని రైల్వే శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : NTR Baby Kits : త్వరలో ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’