ఇంగ్లండ్తో బర్మింగ్హామ్లో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు (Indian team in the second Test) పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ నాలుగో రోజుకు చేరుకున్నప్పటికీ టీమిండియా విజయాన్ని చేరువ చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సమిష్టిగా రాణిస్తూ భారత్ ఆధిక్యాన్ని భారీ స్థాయిలో పెంచుకుంది.రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు మరోసారి శక్తిని చూపించారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) అర్థశతకం సాధించి నిలకడగా ఆడగా, రిషభ్ పంత్ దూకుడుగా ఆడి అభిమానులను అలరించాడు. కేఎల్ రాహుల్ కూడా అర్ధశతకం బాదేశాడు. పంత్ కేవలం 58 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. నాలుగో రోజు రెండో సెషన్ నాటికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. మొత్తం ఆధిక్యం 417 పరుగులకు చేరుకుంది.

తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు నమోదు
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ మొదటి ఇన్నింగ్స్లో రికార్డు స్థాయిలో పరుగులు చేసింది. గిల్ 269 పరుగుల డబుల్ సెంచరీతో చెలరేగాడు. జడేజా (89), జైస్వాల్ (87) కూడా అద్భుత ఇన్నింగ్స్లు ఆడారు. దీంతో భారత్ మొత్తం 587 పరుగులు చేసింది.భారత్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. హ్యారీ బ్రూక్ (158), జామీ స్మిత్ (184 నాటౌట్) తప్ప మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. సిరాజ్ 6 వికెట్లు పడగొట్టి విజృంభించాడు. ఆకాశ్ దీప్ మరో 4 వికెట్లు తీసి ఇంగ్లండ్ను 407 పరుగులకు పరిమితం చేశాడు. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లోనే 180 పరుగుల లీడ్ లభించింది.
ఇంగ్లండ్కు భారీ లక్ష్యం ఖాయం
ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్లోనూ ఆధిక్యంలో ఉంది. బ్యాటర్లు రాణిస్తుండటంతో ఇంగ్లండ్ ముందు గట్టినే లక్ష్యం దాదాపు ఖాయం అయ్యింది. ఈ స్థితిలో భారత్ విజయానికి ఒక అడుగు దూరంలో నిలిచింది.
Read Also : Virender Sehwag: కోహ్లీ అభిమానులకు అతని మాటే శాసనం: సెహ్వాగ్