భారత్ మరోసారి చరిత్ర సృష్టించింది. మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ల (India iPhones) ఎగుమతుల్లో తాజాగా భారీ గెలుపొందింది. అమెరికా మార్కెట్కు ఐఫోన్లను సరఫరా చేసే విషయంలో భారత్ తొలిసారి చైనాను వెనక్కి నెట్టి ముందుకు దూసుకెళ్లింది.ఇది యాపిల్కు కొత్త అధ్యాయమే. ఒకప్పుడు చైనా (China) పైనే ఆధారపడిన ఐఫోన్ తయారీ ఇప్పుడు భారత్ వైపు మళ్లుతోంది. ఇటీవల వచ్చిన ఓండియా (మునుపటి క్యానలిస్) నివేదిక ప్రకారం, 2025 ఏప్రిల్లో భారత్ నుంచి అమెరికాకు దాదాపు 30 లక్షల ఐఫోన్లు ఎగుమతి అయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 76 శాతం పెరుగుదల.అదే సమయంలో చైనా నుంచి ఎగుమతులు భారీగా పడిపోయాయి. ఏకంగా 76 శాతం తగ్గి, కేవలం 9 లక్షల యూనిట్లకే పరిమితమయ్యాయి. దీంతో చైనాను మించిపోయిన భారత్, ఏప్రిల్లో టాప్ ఎగుమతిదారుగా నిలిచింది.అయితే పూర్తిగా గేమ్ మార్చిందా అంటే కాదు. జనవరి నుంచి ఏప్రిల్ 2025 మధ్య గణాంకాల ప్రకారం, చైనా ఇప్పటికీ స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఈ నాలుగు నెలల్లో చైనా 1.32 కోట్ల ఐఫోన్లు ఎగుమతి చేస్తే, భారత్ 1.15 కోట్లు పంపింది.ఇంతలో భారత్ చూపిస్తున్న వేగం ఆశ్చర్యకరం. ప్రతి నెల గణనీయంగా పెరుగుతున్న ఎగుమతులు భారత స్థానాన్ని మరింత బలంగా నిలబెడుతున్నాయి. ఇది యాపిల్ వ్యూహానికి కీలక విజయంగా చెప్తున్నారు పరిశోధకులు.

భారత్ ఎందుకు ఫోకస్లో ఉంది?
చైనా మీద పూర్తిగా ఆధారపడకుండా ఉండాలన్నది యాపిల్ ప్లాన్ (Apple iPhone). కరోనా తర్వాత వ్యాప్తించిన సరఫరా సమస్యలు కంపెనీకి కీలక బోధనలిచ్చాయి. దీంతో యాపిల్ భారత్పై దృష్టి పెంచింది.ఇక్కడ మౌలిక సదుపాయాలు మెరుగవ్వడం, కార్మిక ఖర్చులు తక్కువగా ఉండటం కూడా ముఖ్యమైన అంశాలు. పలు థర్డ్-పార్టీ సప్లయర్ల ద్వారా యాపిల్ భారీగా ఐఫోన్లను సేకరిస్తోంది. ఇదంతా అమెరికా సుంకాల నుంచి తప్పించుకోవాలన్న వ్యూహంతో కూడినది.
భవిష్యత్ దిశ
ఇలాగే కొనసాగితే, భారత్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదగడం ఖాయం. నెలనెలా పెరుగుతున్న ఎగుమతులు దీన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.యాపిల్ తన ప్రొడక్షన్ బేస్కి భారత్ను కేంద్రంగా మార్చేందుకు సిద్ధమవుతోంది. ఇది దేశానికి భారీ ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు తీసుకొస్తుంది.భారత మార్కెట్కు ఇది గర్వకారణం మాత్రమే కాదు. భవిష్యత్ టెక్ రంగంలో భారత్ స్థానం ఎంత బలంగా ఉన్నదో తెలిపే ఉదాహరణ కూడా.
Read Also : Asteroids : శుక్ర గ్రహం మాటున ప్రమాదకర గ్రహశకలాలు!