I will protect teachers' jobs as long as I live.. Mamata Banerjee

Mamata Banerjee : నేను బతికున్నంత కాలం టీచర్ల ఉద్యోగాలు కాపాడతా : మమతా బెనర్జీ

Mamata Banerjee : ఇటీవల సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్‌లో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న 25,753 మంది టీచర్లు , ఇతర సిబ్బంది నియామకం చెల్లుబాటు కాదంటూ సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి స్పందించారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు విని శోకంతో తన గుండె బండరాయిగా మారిందని అన్నారు. తాను ప్రాణాలతో ఉన్నంతవరకు అర్హులెవరు తమ ఉద్యోగాలు కోల్పోలేరని హామీ ఇచ్చారు.

Advertisements
నేను బతికున్నంత కాలం టీచర్ల

నన్ను జైల్లో పెట్టే అవకాశం లేకపోలేదు

ఇటీవల అత్యున్నత న్యాయస్థానం టీచర్ల నియామకం అంశంలో ఇచ్చిన తీర్పు విని నా హృదయం శోక సంద్రమైంది. బండరాయిగా మారింది. ఆ తీర్పు ఆమోదయోగ్యంగా లేదు. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను జైల్లో పెట్టే అవకాశం లేకపోలేదు. ఎవరైనా నాకు సవాల్‌ విసిరితే.. వారికి సమాధానం చెప్పగలను. అర్హులు ఉద్యోగాలు కోల్పోడాన్ని భరించలేను. నేను ప్రాణాలతో ఉన్నంతవరకు వారి ఉద్యోగాలను కాపాడతాను అని టీచర్లతో సమావేశమైన సందర్భంగా దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న 25,753 మంది టీచర్లు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న 25,753 మంది టీచర్లు, సిబ్బంది నియామక ప్రక్రియ యావత్తూ కళంకపూరితంగా, అక్రమాలతో కూడుకొని ఉందని సుప్రీంకోర్టు ఇటీవల అభిప్రాయపడింది. టీచర్లు, ఇతర సిబ్బంది నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు గతేడాది ఏప్రిల్‌లో వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సమర్థించిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో మోసానికి పాల్పడ్డారంటూ ధర్మాసనం పేర్కొంది.

Read Also: భద్రాచలంలో ప్రారంభమైన శ్రీరామ పట్టాభిషేకం

Related Posts
ఓటర్ల జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
Election Commission released the list of voters

హైదరాబాద్: తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం విడుదల చేసింది. సవరణ తర్వాత తుది ఓటర్ల జాబితాను సీఈవో సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. జాబితా ప్రకారం, Read more

నిజమైన ‘భారతరత్న’ మన్మోహనుడే!
manmohan singh bharatartna

భారత ఆర్థిక వ్యవస్థకు ఆధునిక రూపం ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన మృతితో దేశవ్యాప్తంగా ప్రజలు, నెటిజన్లు తీవ్ర దిగ్బ్రాంతి Read more

గ్రూప్‌-2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : చంద్రబాబు
మేలో తల్లికి వందనం.. చంద్రబాబు కీలక ప్రకటన

రోస్టర్‌ విధానంపై అభ్యర్థులు 3 రోజులుగా ఆందోళన అమరావతి: ఏపీలో గ్రూప్-2 పరీక్షలపై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. Read more

జారెడ్ ఐజాక్‌మాన్‌ను NASA చీఫ్‌గా నియమించిన ట్రంప్..
Jared Isaacman

యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) తదుపరి చీఫ్‌గా బిలియనీర్ వ్యాపారవేత్త మరియు కమర్షియల్ ఆస్ట్రోనాట్ జారెడ్ ఐజాక్మాన్‌ను నియమించారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×