janasena : మాజీ మంత్రి, ఆ పార్టీ నేత బాలినేని శ్రీనివాస్రెడ్డి కాకినాడ జిల్లా పిఠాపురం శివారులోని చిత్రాడలో ఏర్పాటు చేసిన ‘జయ కేతనం’ సభలో మాట్లాడారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో సినిమా తీయాలనేది తన కోరిక అని, ఇదే విషయం ఆయనకు చెప్పానని అన్నారు. పిఠాపురం సాక్షిగా అన్నీ నిజాలే చెబుతా. నాకు ప్రాణం ఉన్నంత వరకు.. పదవి ఉన్నా, లేకపోయినా పవన్ కల్యాణ్ వెంటే ఉంటా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతో నష్టపోయా. మా తండ్రి ఇచ్చిన ఆస్తిలో సగం అమ్మేశా అన్నారు.

చేసిన పాపాలు ఎక్కడికీ పోవు
జగన్ వల్ల నేను, నా కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డాం. నా ఆస్తులు, నా వియ్యంకుడికి ఉన్న ఆస్తులను కూడా జగన్ కాజేశారు. జగన్ చేసిన అన్యాయాలు చెప్పాలంటే సమయం సరిపోదు. రఘురామకృష్ణరాజు ఏదో అన్నారని లోపల పెట్టి ఆయన్ను కొట్టించావు. చేసిన పాపాలు ఎక్కడికీ పోవు అని జగన్ తెలుసుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న చిన్న వారిని అరెస్టు చేస్తున్నారు. స్కాములు చేసి, రూ.కోట్లు సంపాదించిన వారిని ఇంకా అరెస్టు చేయడంలేదు.. అదే నా బాధ. వైఎస్ను అడ్డం పెట్టుకుని జగన్ సీఎం అయ్యారు. పవన్ కల్యాణ్ స్వశక్తితో ఎదిగి నాయకుడు అయ్యారు అని బాలినేని అన్నారు.