మనస్సు విరిగిపోవడం వల్లనే వైసీపీ నుంచి వైదొలిగా : విజయసాయిరెడ్డి

మనస్సు విరిగిపోవడం వల్లనే వైసీపీ నుంచి వైదొలిగా : విజయసాయిరెడ్డి

అమరావతి: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కాకినాడ పోర్టు అక్రమాల కేసులో సీఐడీ విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జగన్‌ చుట్టూ కోటరీ ఉందని.. ఆ కోటరీ వల్లే ఆయనకు తాను దూరమైనట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జగన్‌ మనసులో స్థానం లేదని తెలిశాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్‌కు చెప్పినట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్‌కు భవిష్యత్తు ఉంటుంది. జగన్‌ చుట్టూ కొందరు నేతలు కోటరీగా ఏర్పడ్డారు. జగన్‌ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలి. నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు నమ్మకూడదు అని వ్యాఖ్యలు చేశారు.

Advertisements
మనస్సు విరిగిపోవడం వల్లనే వైసీపీ నుంచి వైదొలిగా : విజయసాయిరెడ్డి

దీంట్లో చాలా మంది పాత్రధారులు, సూత్రధారులు

వైసీపీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు నాకూ మా నాయకుడికి మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి, జగన్‌మోహన్‌రెడ్డి మనసు విరిచే ప్రయత్నం చేసి, విజయం సాధించారు. మూడున్నర సంవత్సరాల పాటు అవమానాలు పాలయ్యా. నేను దిగిన ప్రతి మెట్టు ఇంకొకరు పైకి ఎక్కడానికి ఉపయోగపడింది. దీంట్లో చాలా మంది పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారు. ఈ పార్టీ నుంచి వెళ్లిపోయినందుకు నేను ఏవిధంగానూ నష్టపోవడం లేదు. చిత్తశుద్ధితో పనిచేశా. ఇప్పుడు కూడా జగన్‌మోహన్‌రెడ్డి బాగుండాలని కోరుకుంటున్నా. జగన్‌ చుట్టూ ఉన్న కోటరీ నుంచి ఎప్పుడు బయటపడతారో ఆ రోజు ఆయనకు భవిష్యత్‌ ఉంటుంది. ఇంతకన్నా ఏమీ చెప్పలేను అన్నారు.

అంతే తప్ప నేను చేసిందేమీ లేదు

కాకినాడ పోర్టులో వ్యాపారం చేశారా? లేదా? కోట్లు ఆర్జించారా? అన్న విషయం నాకు తెలియదని సీఐడీ విచారణలో చెప్పా. గతంలో సీబీఐ, ఈడీ కేసుల్లో జేడీ లక్ష్మీనారాయణ నన్ను ఏ2గా చేర్చారు. ఇప్పుడు కాకినాడ పోర్టు కేసులో కూడా ఏ2 ఉంచారు. అంతే తప్ప నేను చేసిందేమీ లేదు. ఏ2ను నాకు ఒక స్టాండడైజ్‌ చేశారు. ఈ కేసు రిజిస్టర్‌ అయినప్పుడు వైసీపీలోనే ఉన్నాను. అప్పుడు నాకు పూర్తి వివరాలు తెలియవు. ఈరోజు నాకు పూర్తి అవగాహన వచ్చింది. ఎవరు చేశారు? ఎలా చేశారు? అన్న విషయాలు తెలిశాయి. జగన్‌మోహన్‌రెడ్డిని కేసు నుంచి పక్కకు తప్పించడానికి మీరూ, విక్రాంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారా అని అడిగారు. అవన్నీ నాకు తెలియవని చెప్పాను అన్నారు.

Related Posts
టీఎస్‌పీఎస్సీ కొత్త చైర్మన్‌గా బుర్రా వెంకటేశం..గవర్నర్ ఆమోదం
Governor approves Burra Venkatesham as new chairman of TSPSC

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియామకం అయ్యారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ Read more

బీజేపీలో చేరిన ఆప్‌ నేత కైలాశ్‌ గెహ్లాట్‌
AAP leader Kailash Gahlot joined BJP

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రి, సీనియర్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు కైలాష్ గెహ్లాట్‌ బీజేపీలో చేరారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన గహ్లోత్‌ Read more

జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి
Terror attack on Army vehicle in Jammu and Kashmir

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులు భయాన్ని కలిగిస్తున్నాయి. ఈ ప్రదేశంలో ఉగ్రవాదులు ఇటు ఇటుగా రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అఖ్నూర్‌ సెక్టార్‌లో ఆర్మీ వాహనంపై Read more

టన్నెల్ ఘటన..ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం గుర్తింపు !
Tunnel accident.. Engineer Gurpreet Singh body identified!

హైదరాబాద్‌ : 16 రోజుల ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్ లో కీలక అప్డేట్ వచ్చేసింది. టీబీఎం మెషీన్ ముందు భాగంలో మృతదేహాం ఆనవాళ్లు కనుగొనింది రెస్క్యూ టీం. Read more

       
×