మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో జరిగిన పాము కాటు కుంభకోణం సంచలనంగా మారింది. 2018 నుండి 2022 వరకు, కొన్ని వ్యక్తులు పాము కాటు (Snake bite)కారణంగా మరణించినట్లు ఫేక్ డెత్ రిపోర్టులు (fake death reports) సృష్టించి, రాష్ట్ర ప్రభుత్వ పరిహారం పథకాలను దుర్వినియోగం చేశారు. ఒక వ్యక్తి 30 సార్లు మరణించినట్లు నమోదు చేయబడగా, మరొకరు 29 సార్లు మరణించినట్లు నమోదు చేయబడ్డారు. ఈ కుంభకోణం (scandal)ద్వారా సుమారు ₹11.26 కోట్ల మేర ప్రభుత్వ నిధులు దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా, ఈ కుంభకోణం ప్రభుత్వ పరిహారం మంజూరు ప్రక్రియలో ఉన్న లోపాలను, సాంకేతిక పర్యవేక్షణ లోపాలను, మరియు డిజిటల్ గవర్నెన్స్ లో ఉన్న దుర్వినియోగాలను వెల్లడించింది.

కొత్త కుంభకోణం
ఈ కుంభకోణాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పట్వారీ మాట్లాడుతూ, “పాము కాటు కుంభకోణం గురించి నేను ఎప్పుడూ వినలేదని” అన్నారు. అయితే, “సీఎం మోహన్ యాదవ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ఇలాంటి కొత్త కుంభకోణం జరిగిందని” ఆయన విమర్శించారు. ఈ కుంభకోణం ప్రభుత్వ పరిహారం మంజూరు ప్రక్రియలో ఉన్న లోపాలను, సాంకేతిక పర్యవేక్షణ లోపాలను, మరియు డిజిటల్ గవర్నెన్స్ లో ఉన్న దుర్వినియోగాలను వెల్లడించింది.
పాము కాటు కుంభకోణం గురించి తాను ఎప్పుడూ వినలేదని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ అన్నారు. అయితే సీఎం మోహన్ యాదవ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ఇలాంటి కొత్త కుంభకోణం జరిగిందని విమర్శించారు.
నకిలీ మృతుల జాబితా
కాగా, మధ్యప్రదేశ్లోని సియోనీ జిల్లాలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ జిల్లాలో సుమారు 47 మంది పాము కాటు వల్ల పలుసార్లు చనిపోయినట్లు అధికారికంగా పేర్కొన్నారు. నకిలీ మృతుల జాబితాలో ఒకే వ్యక్తిని పాము కాటు కారణంగా మరణించినట్లు 30 సార్లు చూపించారు. మరో వ్యక్తిని 19 సార్లు చనిపోయినట్లు ప్రకటించారు. ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.4 లక్షల పరిహారాన్ని మంజూరు చేశారు. దీంతో రూ.11.26 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఈ ఆరోపణలపై ఆర్థిక శాఖ బృందం దర్యాప్తు చేసిందని జబల్పూర్ డివిజనల్ జాయింట్ డైరెక్టర్ (ట్రెజరీస్ అండ్ అకౌంట్స్) రోహిత్ సింగ్ కౌశల్ తెలిపారు. తదుపరి చర్యల కోసం సియోనీ కలెక్టర్కు నివేదికను సమర్పించినట్లు చెప్పారు.
Read Also : Aishwarya Rai: బాడీ షేమింగ్ విమర్శలపై స్పందించిన ఐశ్వర్యరాయ్