हिन्दी | Epaper
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

హైకోర్టు న్యాయవాదికి హైడ్రా కమిషనర్ వార్నింగ్

Sudheer
హైకోర్టు న్యాయవాదికి హైడ్రా కమిషనర్ వార్నింగ్

హైదరాబాద్‌లో హైడ్రా టీం అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటూ చెరువుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తోంది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని సమస్య ఉన్న ప్రదేశాలకు వెళ్లి తక్షణ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా ఐలాపూర్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన బృందంతో పర్యటించారు. ప్లాట్‌ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అక్రమ నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్లిన కమిషనర్‌కు హైకోర్టు న్యాయవాది ముఖీంతో వాగ్వాదం జరగడం సంచలనంగా మారింది.

సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ప్రశ్నిస్తూ, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. దీనికి హైడ్రా కమిషనర్ స్పందిస్తూ, కోర్టు ఉత్తర్వుల్ని గౌరవిస్తామని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు భావిస్తే కంటెంప్ట్ పిటిషన్ వేయవచ్చని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను న్యాయస్థానం ముందు నిలిపి పరిశీలించాలని న్యాయవాది కోరగా, ఇదంతా ఓవర్ యాక్షన్ చేయవద్దని రంగనాథ్ న్యాయవాదికి వార్నింగ్ ఇచ్చారు.

hydra commissioner warning

ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. రంగనాథ్ మాట్లాడుతూ కొనుగోలుదారులను కొందరు కావాలని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు కనిపిస్తోందని, సమస్యను సమగ్రంగా పరిశీలించి ఇరు వర్గాలను కలిసి వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటామని తెలిపారు.

హైడ్రా టీం తరపున రంగనాథ్ “ఈ విషయాన్ని రెండు వారాల్లో లోతుగా పరిశీలించి, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని 2 నెలల్లో సమస్యను పరిష్కరిస్తాం” అని హామీ ఇచ్చారు. ప్లాట్ల వివాదంపై కోర్టు ఆదేశాలను గౌరవించడంతో పాటు బాధితులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా టీమ్ తీసుకుంటున్న చర్యలను కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు న్యాయపరమైన పరిమితుల్ని గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో అనేది ఆసక్తిగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870