దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ (Republic Day 2026) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.
అనంతరం ఆయన సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ బలగాలు, ఎన్సీసీ కేడెట్లు క్రమశిక్షణతో నిర్వహించిన మార్చ్ పాస్ట్ దేశభక్తిని చాటుతూ ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు.





























Pics by s.sridhar