हिन्दी | Epaper
ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

Telugu News: Prasad Kumar: ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ

Sushmitha
Telugu News: Prasad Kumar: ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ

హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ (Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ (Prasad Kumar) విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాగా, మరో నలుగురు ఎమ్మెల్యేల విచారణ దాదాపు తుది అంకానికి చేరుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హత అంశం తేల్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Read Also: YSRCP: విశాఖ ఉక్కు పై వైఎస్సార్సీ ఫేక్ ప్రచారం: మంత్రి సుభాష్

Prasad Kumar
Prasad Kumar Speedy investigation into the disqualification of MLAs

తుది మౌఖిక విచారణ

స్పీకర్ బుధవారం నాడు విచారణలో ముగింపు దశలో నిర్వహించే మౌఖిక (వైవా) విచారణను చేపట్టారు. ఈ విచారణ అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో జరిగింది.

  • బుధవారం విచారణ: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్లపై దాఖలైన పిటిషన్లపై పిటిషనర్ల న్యాయవాదులు తమ వాదనలు మౌఖికంగా వినిపించారు.
  • గురువారం విచారణ షెడ్యూల్: గురువారం ఉదయం 11 గంటలకు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వర్సెస్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆ తర్వాత 12 గంటలకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పిటిషన్లపై మౌఖిక వాదనలు విననున్నారు.

గురువారంతో ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ ముగియనున్నది. స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల వివరణలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

సుప్రీంకోర్టు ఆదేశాలు, ఉత్కంఠ

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణను నాలుగు వారాల్లో ముగించి, నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆదేశించింది. దీంతో రాబోయే నెల రోజుల్లోగా స్పీకర్ తన తుది తీర్పును వెలువరించే అవకాశాలున్నాయి. స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. విచారణ సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870