ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో డిసెంబర్ 13న మెస్సీ (Messi) టూర్ అండ్ లైవ్ ఈవెంట్ జరగనుంది. ఇవాళ సాయంత్రం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఒక చారిటీ మ్యాచ్లో ఆయన పాల్గొననున్నారు. అలాగే ఈ ఈవెంట్కు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి జనం భారీగా తరలివచ్చే అకాశం ఉండడంతో నగరంలో ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లోకి తెచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.
Read Also: TG: రేపు రెండో విడత పోలింగ్
ఈ ఆంక్షలు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11:50 వరకు అమల్లో ఉండనున్నాయి.పోలీసులు జారీ చేసిన ట్రాఫిక్ అడ్వైజరీ ప్రకారం.. ఫలక్నుమా-ఉప్పల్, సికింద్రాబాద్-ఉప్పల్ మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నారు. తార్నాక నుంచి ఉప్పల్ వైపు వెళ్లే వాహనాలను హబ్సిగూడ క్రాస్రోడ్స్ వద్ద నాచారం, చర్లపల్లి వైపు మళ్లిస్తారు. రామాంతపూర్ నుంచి వచ్చే వాహనాలను స్ట్రీట్ నెం.8 వద్ద దారి మళ్లిస్తారు.
ఈ మార్గాల్లో ప్రయాణించే వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆర్టీసీ బస్సులు లేదా మెట్రో రైలు వంటి ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.మ్యాచ్ వీక్షకుల కోసం స్టేడియంకు కిలోమీటరు పరిధిలోనే 10 ప్రధాన పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. వీవీఐపీ, వీఐపీ పాస్లు ఉన్నవారికి స్టేడియం లోపలే పార్కింగ్ సౌకర్యం కల్పించారు.

ఎల్బీ నగర్ వైపు నుంచి వచ్చేవారి కోసం
పాసులు లేని వాహనాలను ఏక్ మినార్, ఎల్జీ గోడౌన్ చెక్పోస్టుల వద్దే నిలిపివేస్తారు. హబ్సిగూడ నుంచి వచ్చేవారు పెంగ్విన్, లిటిల్ ఫ్లవర్ కాలేజ్, మున్సిపల్ గ్రౌండ్స్లో పార్క్ చేయాలి. రామాంతపూర్, ఎల్బీ నగర్ వైపు నుంచి వచ్చేవారి కోసం జైన్ పార్కింగ్, శాండ్ అడ్డా, ఈనాడు ఆఫీస్ వద్ద పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
అలాగే లారీలు, డంపర్లు, వాటర్ ట్యాంకర్ల వంటి అన్ని రకాల భారీ వాహనాలపై మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11:50 వరకు ఆంక్షలు ఉంటాయి. ఘట్కేసర్, ఎల్బీ నగర్, వరంగల్ నుంచి ఉప్పల్ మీదుగా వచ్చే భారీ వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. నగరవాసులు ఈ మార్పులను గమనించి, పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: