ఫుడ్బాల్ లెజెంట్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ (Messi) గోట్ ఇండియా టూర్లో భాగంగా శనివారం హైదరాబాద్ రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను ఈవెంట్ ఆర్గనైజర్ అనుత్తమ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. అనుత్తమ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం 5:30 గంటల నుంచే స్టేడియంలో సంగీత కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
Read Also: Messi: మెస్సీతో ఫోటో ఛార్జీల రూమర్స్పై స్పందించిన నిర్వాహకులు
అభిమానుల కోసం చాలా వినోదాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం
మెస్సీ (Messi) సాయంత్రం 7 నుంచి 7:30 గంటల మధ్యలో స్టేడియానికి చేరుకుంటాడు. సుమారు గంటపాటు మైదానంలో అభిమానుల మధ్య గడపనున్నాడు. “అభిమానుల కోసం చాలా వినోదాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం.

మెస్సీ గంటపాటు మనతో ఇక్కడే ఉంటాడు” అని అనుత్తమ్ రెడ్డి వివరించారు.ఈ పర్యటనలో భాగంగా మెస్సీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడని ఆయన తెలిపారు. ముఖ్యంగా యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ హోదాలో చిన్నారులతో ప్రత్యేకంగా ముచ్చటిస్తాడని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: