హైదరాబాద్: తెలంగాణలోని పత్తి రైతుల సమస్యలు, తేమ శాతం సడలింపు, కనీస మద్దతు ధర (MSP) పెంపు వంటి అంశాలపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) కీలక విజ్ఞప్తి చేశారు. మంగళవారం ముంబైలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(Cotton Corporation of India) (సీసీఐ) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాను ఆయన ప్రత్యేకంగా కలిసి గంటపాటు చర్చించారు.
Read Also: Rain Alert: కోస్తా అలర్ట్! కృష్ణా జిల్లాలో తుఫాన్ ప్రభావం
తేమ శాతం సడలింపు, ధరల పెంపు డిమాండ్
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, దీర్ఘకాల నైరుతి వానా కాలం మరియు తుఫానుల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులలో గరిష్టంగా 23% వరకు తేమ ఉంటుందని మంత్రి వివరించారు. పత్తిలో కూడా తేమ శాతం పెరిగిందని, అయితే ప్రస్తుత నాణ్యత ప్రమాణాల ప్రకారం నిర్దేశించిన 8-12 శాతం తేమ ఎఫ్ఏక్యూ (FAQ) పాటించడం అసాధ్యమని స్పష్టం చేశారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు తేమ శాతాన్ని తక్షణమే 14 శాతం వరకు సడలించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, వ్యవసాయ సాగు పెట్టుబడులకు అనుగుణంగా కనీస మద్దతు ధరను కూడా సవరించాలని ఆయన కోరారు.

కొనుగోలు కేంద్రాల విస్తరణ, ప్రత్యేక ప్యాకేజీ
అన్ని పత్తి పండించే జిల్లాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను విస్తరించి, ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ నుండి రైతులను కాపాడాలని మంత్రి సూచించారు. గులాబీ తెగులు సోకి, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ అందించాలని, అలాగే పసుపురంగు వచ్చిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని కోరారు. గత సీజన్లలో సేకరించిన పత్తికి సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి వెంట జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా ఉన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీసీఐ ఛైర్మన్ లలిత్ కుమార్ గుప్తా, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరిని కలిశారు?
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాను కలిశారు.
పత్తికి తేమ శాతాన్ని ఎంతవరకు సడలించాలని మంత్రి కోరారు?
ప్రస్తుతం ఉన్న 8-12 శాతం నుంచి తక్షణమే 14 శాతం వరకు సడలించాలని కోరారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: