हिन्दी | Epaper
ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

Telugu News: Kishan Reddy: ఇంధన ఎనర్జీ రంగంలో అద్భుతమైన అవకాశాలు

Sushmitha
Telugu News: Kishan Reddy: ఇంధన ఎనర్జీ రంగంలో అద్భుతమైన అవకాశాలు

హైదరాబాద్: దేశంలో గతం కంటే ప్రస్తుతం ఇంధన రంగంలో సరికొత్త ఆవిష్కరణలతో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్(Economic Times) ఎనర్జీ లీడర్‌షిప్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. బొగ్గు, గనులు, పునరుత్పాదక శక్తి వంటి రంగాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగా ప్రస్తుతం భారత్ అంతర్జాతీయ ఇంధన రంగంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగనుందని, దీంతో మన ఇంధన అవసరాలు భారీగా పెరుగుతాయని ఆయన చెప్పారు.

Kishan Reddy

పునరుత్పాదక శక్తి, బొగ్గు వినియోగం

2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ(Minister Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. పునరుత్పాదక శక్తి సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో, సౌర విద్యుత్ ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉందని తెలిపారు. 2014 నుంచి పునరుత్పాదక శక్తి ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందని, దేశ విద్యుత్ అవసరాల్లో సగం శిలాజేతర ఇంధనాల నుంచే ఉత్పత్తి అవుతోందని చెప్పారు. అయితే, భవిష్యత్తులో కూడా బొగ్గు(Coal) కీలక పాత్ర పోషిస్తుందని, గతేడాది రికార్డు స్థాయిలో 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని తెలిపారు. 2030 నాటికి బొగ్గు డిమాండ్ 1.6 బిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా వేశారు.

భవిష్యత్ లక్ష్యాలు, కొత్త మిషన్లు

ఇంధన రంగంలో సుస్థిరత సాధించేందుకు, 2030 నాటికి 15 గిగావాట్ల సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని కిషన్ రెడ్డి అన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ ద్వారా 2030 నాటికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాలని సంకల్పంతో పనిచేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి క్రిటికల్ మినరల్స్ అవసరం పెరుగుతుందని, వీటి అభివృద్ధికి ‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’ ద్వారా ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చామని ఆయన చెప్పారు.

భారత్ ఎనర్జీ లీడర్‌షిప్ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానంగా ఏం చెప్పారు?

భారత్ ఇంధన రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, అవకాశాలు ఉన్నాయని, పునరుత్పాదక శక్తి ఉత్పత్తిలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ఆయన చెప్పారు.

2030 నాటికి బొగ్గు డిమాండ్ ఎంతగా పెరుగుతుందని అంచనా?

2030 నాటికి బొగ్గు డిమాండ్ 1.6 బిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870