ఖైరతాబాద్ విశ్వమహాగణపతి శోభాయాత్ర
Ganapati Shobhayatra : దేశవ్యాప్తంగా గణేశ్ శోభాయాత్రలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ నిమజ్జనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. (Ganapati Shobhayatra) ముఖ్యంగా హైదరాబాద్లో గణనాథుని వేలాది విగ్రహాలు నగర వీధుల్లో అలరరిస్తున్నాయి.
వరంగల్
వరంగల్ జిల్లాలో రెండో రోజు గణనాథుల నిమజ్జనం జరిగింది. పోచమ్మ మైదానం నుంచి చిన్న వడ్డేపల్లి చెరువు వరకు విగ్రహాలు తరలించారు.
భద్రాద్రి కొత్తగూడెం
భద్రాచలంలో గోదావరి నదిలో నిమజ్జనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐదు క్రేన్లు, రెండు లాంచీలు, ఎనిమిది బోట్లు సిద్ధం చేశారు. సుమారు 200 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు. ఆదివారం చంద్రగ్రహణం ఉండటంతో అధిక సంఖ్యలో విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్ నిమజ్జన దృశ్యాలు
తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద గణనాథుల సందడి కనిపించింది. సెక్రటరీయేట్, లుంబినీ పార్క్ పరిసరాల్లో శోభాయాత్రలు జరిగాయి. భారీ విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు, చిన్న విగ్రహాలను ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలించారు. డీజేల్లో రాజకీయ నాయకుల పాటలు వినిపించగా, యువత డాన్స్లతో సందడి చేశారు.
ఖైరతాబాద్ బడా గణేష్
- అర్ధరాత్రి 12 గంటలకు కలశపూజ నిర్వహించి, గణనాథుడిని ట్రాలీపైకి ఎక్కించారు.
- ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ బరువు 50 టన్నులు.
- 200 టన్నుల కెపాసిటీ గల టస్కర్ ట్రక్కుపై శోభాయాత్ర కొనసాగింది.
- ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం చేయనున్నారు.
- గణేష్ విగ్రహానికి రెండు వైపులా అమ్మవార్లు దర్శనమిస్తున్నారు.
- ఈ ఏడాది సుమారు 50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.
శోభాయాత్ర వైభవం
ఈ ఏడాది ఖైరతాబాద్ బడా గణేష్ 69 అడుగుల ఎత్తుతో “విశ్వశాంతి మహా శక్తి గణపతి”గా దర్శనమిచ్చారు. పోలీసులు రూట్ క్లియర్ చేస్తూ, హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటలలోపు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
Read also :