జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో(Jublieehills Results) కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందడం రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. 20 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి? రాజకీయ ప్రయాణం ఎలా సాగింది? అనే ప్రశ్నలపై ఆసక్తి పెరుగుతోంది.
Read Also: Jubilee Hills: కౌంటింగ్ హాల్ నుంచి నిరాశగా వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి

సామాన్య కుటుంబం నుంచి రాజకీయ రంగంలోకి
నవీన్ యాదవ్(Naveen Yadav) తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ యూసఫ్గూడలో జన్మించి పెరిగారు. సాధారణ కుటుంబ పరిస్థితే ఉన్నా, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పీజేఆర్కు శిష్యుడిగా పేరు సంపాదించారు. సినిమా వ్యక్తులతో మంచి పరిచయం ఉన్నప్పటికీ, పలు కేసులు ఉండటంతో ఆయనపై రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది. దీనివల్ల రాజకీయంగా పెద్దగా ఎదగలేకపోయారు. అయితే ఈ పరిస్థితుల్లోనే ఆయన కుమారుడు నవీన్ యాదవ్ 30 ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా గెలవాలన్న ధృఢ లక్ష్యంతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
మొదటి ఎన్నికల నుంచే ప్రభావం చూపిన నవీన్
2014 ఎన్నికల్లో జూబ్లీహిల్స్(Jublieehills Results) నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిని మూడో స్థానానికి నెట్టారు.
2018లో ఎంఐఎం టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి 18,817 ఓట్లు తెచ్చుకున్నారు. వరుస పరాజయాలు వచ్చినా ఆయన వెనక్కు తగ్గలేదు. నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు, పేదలకు ఆర్థిక సహాయం, వేలాది మహిళలకు సామూహిక సీమంతాలు నిర్వహించడం వంటి సేవలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. సాధారణ ప్రజలకు చేరువగా, సౌమ్య స్వభావం కలిగిన నాయకుడిగా ఆయనకు స్థానిక స్థాయిలో విశేషమైన ఫాలోయింగ్ పెరిగింది. కుటుంబంపై ఉన్న రౌడీ షీట్ ఇమేజ్ ఆయనకు అంటలేదు.
కాంగ్రెస్ చేరిక – టర్నింగ్ పాయింట్
2023 ఎన్నికలకు ముందు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అజారుద్దీన్ విజయం కోసం బలంగా పనిచేశారు, అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అనంతరం గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపినాథ్ ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. హైదరాబాద్ మధ్యలో ఉన్న జూబ్లీహిల్స్ను గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని చూసుకుంటుండగా నవీన్ యాదవ్ ఉత్తమ ఎంపికగా కనిపించారు. పలువురు సీనియర్లు రేసులో ఉన్నప్పటికీ, హైకమాండ్ చివరకు నవీన్కే టికెట్ ఇచ్చింది.
పక్కా వ్యూహంతో భారీ విజయం
టికెట్ దక్కగానే నవీన్ యాదవ్ సమగ్రమైన వ్యూహంతో ప్రచారాన్ని నడిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర జిల్లాల నేతలతో సమన్వయం చేస్తూ ప్రతి ప్రాంతాన్ని చేరుకున్నారు. కాంగ్రెస్ ఓడిపోతుందన్న అంచనాలను తారుమారు చేస్తూ పెద్ద మెజార్టీతో విజయం సాధించారు. అభ్యర్థిగా మాత్రమే కాకుండా, సేవా కార్యక్రమాల ఆధారంగా ప్రజల్లో బలమైన అనుబంధం ఏర్పరుచుకోవడం ఈ విజయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: