Hyderabad Heavy Rains : హైదరాబాద్ నగరంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు అతిభారీ వర్షాలు కురిసే (Hyderabad Heavy Rains) అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే, ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు, ఉద్యోగుల భద్రత కోసం పోలీసులు ఐటీ కంపెనీలకు ఒక కీలక సూచన చేశారు. వారు వీలైనంత వరకు ఉద్యోగులను వర్క్ ఫ్రం హోమ్ (WFH) చేయడానికి అనుమతించాలని కోరారు.
సైబరాబాద్ పోలీసులు కూడా ఉద్యోగులు ప్రయాణం చేయకుండా ఇంటి నుంచే పని చేస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని తెలిపారు. ఇప్పటికే పలు రూట్లలో వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

IMD ప్రకారం, శుక్రవారం, శనివారం రోజుల్లో మోస్తరు నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీనివల్ల రోడ్లపై నీరు నిల్వలు, జలదిగ్బంధం, చెట్లు కూలిపోవడం, విద్యుత్ లైన్లకు నష్టం కలగవచ్చని తెలిపింది.
ఇప్పటికే వాతావరణ సమస్యల కారణంగా విమాన సర్వీసులు అంతరాయం ఎదుర్కొన్నాయి. ముంబై, పూణే, కోల్కతా నుండి హైదరాబాద్ రావాల్సిన కొన్ని విమానాలు విజయవాడకు మళ్లించబడ్డాయి.
పోలీసుల సూచనల ప్రకారం, ఉద్యోగులు వీలైనంత వరకు రాబోయే రెండు రోజులు ఇంటి నుంచే పనిచేయాలని సూచించారు. ఇది ట్రాఫిక్ సమస్యలు తగ్గించడమే కాకుండా ప్రజల భద్రతకూ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Read also :