హైదరాబాద్(Hyderabad)లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఒక్కసారిగా కమ్ముకున్న మేఘాలతో అల్వాల్, బోయిన్ పల్లి మీదుగా వర్షం మొదలైంది. అలా సికింద్రాబాద్(Secunderabad) అమీర్ పేట, పంజాగుట్ట, మాదాపూర్, మణికొండ ప్రాంతాలకు విస్తరించింది. ఇటు రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట్, నాచారంతో పాటు కోఠి, బేగం బజార్, నారాయణ గూడ, హిమాయత్ నగర్లో భారీ వర్షం పడుతోంది. పాతబస్తీలోని బార్కస్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, టోలిచౌకి, కార్వాన్ను భారీవర్షం ముంచెత్తింది.

అలెర్ట్ : వర్షం రాత్రి వరకు కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. పరిస్థితి తీవ్రంగా ఉన్నందున భాగ్యనగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైనతే తప్పా భయటకు రావొద్దని తెలిపింది. ఇప్పటివరకు మారేడ్పల్లిలో అత్యధికంగా 76 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ముషీరాబాద్, మల్కాజ్గిరీ, ఉప్పల్ ప్రాంతాల్లో 60 నుంచి 73 మిల్లీమీటర్ల వాన పడింది. భారీవర్షంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు స్కూల్స్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.


