
హైదరాబాద్ (HYD) నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్ లోని మొదటి అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. మిగతా అంతస్తులకు మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ ను పొగ కమ్మేయడంతో లోపల విధుల్లో నిమగ్నమైన సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు.
Read Also: Harish Rao: ‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు
కొన్ని కంప్యూటర్లు దగ్ధం
ఈ ఘటనలో కీలక పత్రాలు మంటల్లో కాలిపోయినట్లు సమాచారం. అయితే ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి.. హైదరాబాద్ పోలీస్ సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి, మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని, మొదటి అంతస్తులో మంటలు చెలరేగి, అదుపులోకి వచ్చాయని, కొన్ని కంప్యూటర్లు దగ్ధమయ్యాయని, ఏయే ఫైల్స్ కాలిపోయాయో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఆమె వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు ఉద్యోగులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: