హైదరాబాద్: యువత జీవితాలకు ప్రమాదకరంగా మారిన మాదకద్రవ్యాల నివారణ సమాజంలో అందరి బాధ్యత అని రాష్ట్ర పర్యాటక, ఆబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో గల మఖ్తూమ్ భవన్లోని రాజ్ బహదూర్ గౌర్ హాల్లో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రజానాట్య మండలి(Telangana State Prajanatya Mandali) నిర్వహించిన మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళారూపాల వర్క్షాప్ను(Art workshop) మంత్రి ప్రారంభించారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
ఈ కార్యక్రమంలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నరసింహ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణి శంకర్, సిపిఐ ఎమ్యెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. ఛాయాదేవి, సమితి సభ్యులు మరుపాక అనిల్ కుమార్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి. స్టాలిన్, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కె. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, ఉపాధ్యక్షులు కె. లక్ష్మీ నారాయణతో పాటు కళాకారులు పాల్గొన్నారు.
ప్రజానాట్య మండలి ప్రదర్శనలు
మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజానాట్య మండలి నాటక బృందం మాదకద్రవ్యాల నివారణ, అవగాహన కల్పించడానికి రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల వద్ద తమ కళారూపాలను ప్రదర్శించడం అభినందనీయమన్నారు.
కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అన్ని వసతులు, సౌకర్యాలతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని మంత్రి జూపల్లి తెలిపారు.

మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం ఎక్కడ జరిగింది?
హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో మఖ్తూమ్ భవన్లో జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?
మంత్రి జూపల్లి కృష్ణారావు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: