हिन्दी | Epaper
క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు

Telugu News: Chiranjeevi: రన్ ఫర్ యూనిటీ’ లో పాల్కొన్న చిరంజీవి 

Sushmitha
Telugu News: Chiranjeevi: రన్ ఫర్ యూనిటీ’ లో పాల్కొన్న చిరంజీవి 

హైదరాబాద్: భారతదేశ ఉక్కు మనిషి, అఖండ భారత్ నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ (ఏక్తా దివస్) సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్లు ఈరోజు (అక్టోబర్ 31న) ‘రన్ ఫర్ యూనిటీ’ ని ఘనంగా నిర్వహించారు. ఈ రన్ పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ మరియు సిటీ పోలీస్ పరిధిలోని ఏడు జోన్లలో ఉత్సాహంగా జరిగింది.

Read Also: Montha Cyclone: మొంథా తుఫాన్‌ బీభత్సం..వరదల్లో ఏడుగురు మృతి

Chiranjeevi

పటేల్ స్ఫూర్తి, చిరంజీవి సందేశం

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ధృఢ సంకల్పం, విజన్, కార్యదీక్షత, ధైర్యం మనందరికీ ఆదర్శనీయమని అన్నారు. 560 ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసి, ‘యూనిటీ ఇన్ డైవర్సిటీ’ (భిన్నత్వంలో ఏకత్వం) అనే సందేశాన్ని అందించిన పటేల్‌కు మనం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ర్యాలీలు యువతకు గొప్ప ప్రేరణనిస్తాయని చిరంజీవి అన్నారు.

డీప్‌ఫేక్, సైబర్ నేరాలపై భరోసా

సాంకేతికతను మంచి కోసం వాడుకోవాలని, డీప్ ఫేక్, సైబర్ నేరాలకు(cyber crimes) ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చిరంజీవి అన్నారు. ఈ అంశాన్ని తాను డీజీపీ, సీపీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లానని, వారు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో ఒక చట్టం తీసుకువచ్చేలా ప్రయత్నం జరుగుతోందని, తద్వారా సామాన్యులకు సైతం రక్షణ లభిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

సీపీ వీసీ సజ్జనార్(VC Sajjanar) మాట్లాడుతూ, యువత సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ఆదర్శంగా తీసుకుని మంచి సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాల విషయంలో ముఖ్యంగా డీప్ ఫేక్ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నామని, నేరస్థుల మూలాలపై దృష్టి సారించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, అదనపు డీజీపీ భగవత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870