
రాష్ట్రంలో ఇటీవల బస్సు ప్రమాదాలు(Bus Accident) పెరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి(Ranga Reddy) జిల్లాలో ఇటీవలి రోజులుగా జరిగిన ఘటనలు భయపెడుతున్నాయి.
Read Also: Surat: యువకుడి పై కత్తితో దాడి..ఆపై కాళ్లు నాకించిన వైనం
ఆరాంఘర్ చౌరస్తాలో ఢీ – అదృష్టవశాత్తు ప్రాణనష్టం లేదు
తాజాగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి(Bus Accident) గురైంది. షాద్నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సును వెనుకనుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాద శబ్ధం విన్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. కొంతమంది స్వల్పంగా గాయపడగా, వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం
సమాచారం అందిన వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యంగా అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం ఆధారంగా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు వరుసగా చోటు చేసుకోవడంతో ప్రజా రవాణా భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ రవాణా శాఖ డ్రైవర్లకు కఠినమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: