hyderabad తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తాం స్మితా సబర్వాల్

hyderabad : తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తాం: స్మితా సబర్వాల్

hyderabad : తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తాం: స్మితా సబర్వాల్ మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రత్యేకతను ప్రతిబింబించేలా నిర్వహిస్తామని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు. మే నెలలో జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీల ద్వారా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటనున్నట్లు ఆమె వివరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ త్రిలింగ దేశంగా ప్రాచీనకాలం నుంచి ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు.ఈ భూభాగానికి 2,500 ఏళ్ల విశిష్ట చరిత్ర ఉందని, అనేక గొప్ప కట్టడాలు, సంప్రదాయాలు రాష్ట్రపు గౌరవాన్ని పెంచాయని తెలిపారు.

hyderabad తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తాం స్మితా సబర్వాల్
hyderabad తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తాం స్మితా సబర్వాల్

పర్యాటక ఆకర్షణలు తెలంగాణ వైభవం

రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి, చార్మినార్, గోల్కొండ కోట వంటి పురాతన నిర్మాణాలు రాష్ట్రం సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనమని ఆమె వివరించారు.తెలంగాణ మెడికల్ టూరిజంలో కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నదని, దేశం నలుమూలల నుంచి ప్రజలు వైద్యసేవల కోసం ఇక్కడకు వస్తున్నారని గుర్తు చేశారు.

hyderabad తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తాం స్మితా సబర్వాల్
hyderabad తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తాం స్మితా సబర్వాల్

సినిమా ఆహార రంగాల్లో తెలంగాణ ప్రాముఖ్యత

తెలంగాణ అనేక రంగాల్లో విశేష అభివృద్ధిని సాధించిందని, ప్రత్యేకించి సినిమా,ఆహార పరిశ్రమల్లో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని స్మితా సబర్వాల్ తెలిపారు.రాష్ట్ర ఏర్పడిన 11 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని,మిస్ వరల్డ్ పోటీలు నిర్వహణ ద్వారా తెలంగాణకు అంతర్జాతీయ వేదికపై మరింత గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణలో మిస్ వరల్డ్ – అద్భుతమైన వేదిక

72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో జరగబోతున్నాయి. మే 7 నుంచి మే 31 వరకు నిర్వహించనున్న ఈ పోటీల్లో దాదాపు 140 దేశాల నుంచి కంటెస్టెంట్లు పాల్గొననున్నారు. వీటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు, ప్రముఖులు హాజరుకానున్నారు. మొత్తం 10 ప్రాంతాల్లో ఈ పోటీలు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా, హైదరాబాద్‌లో ప్రారంభ, ముగింపు వేడుకలు జరుగుతాయి.ఈవెంట్ కోసం హైదరాబాద్‌లోని హైటెక్స్, శిల్పారామం, గచ్చిబౌలి స్టేడియాలను పరిశీలిస్తున్నారు. ఇతర కార్యక్రమాలు పోచంపల్లి, యాదగిరిగుట్ట, రామప్ప, లక్నవరం, నాగార్జునసాగర్, వికారాబాద్ వంటి ప్రాంతాల్లో జరపనున్నారు. ఈ పోటీల వల్ల తెలంగాణ ప్రత్యేకమైన గుర్తింపు పొందనుందని అధికారులు చెబుతున్నారు

Related Posts
సీఐడీ విచారణకు హాజరుకాలేనన్న వర్మ
సీఐడీ విచారణకు హాజరుకాలేనన్న వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోమవారం గుంటూరులో సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ, వ్యక్తిగత కారణాలను చూపిస్తూ, వర్మ తన హాజరును Read more

అమల్లోకి ఎన్నికల కోడ్‌.. ​కొత్త పథకాలకు బ్రేక్..!
Election code to come into effect in Telangana.. Break for new schemes.

హైదరాబాద్‌: తెలంగాణలో రేవంత్‌ సర్కార్‌ కొత్తగా నాలుగు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. జనవరి 26న వీటిని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందులో ఇందిరమ్మ ఇళ్లు, Read more

స్విట్జర్లాండ్‌లో “బుర్కా బాన్” చట్టం: 2025 జనవరి 1 నుండి అమలు
burka

స్విట్జర్లాండ్ లో "బుర్కా బాన్" చట్టం 2025 జనవరి 1 నుండి అమలులోకి రానుంది. ఇది ప్రజల ముందు ముఖం కప్పుకున్న వస్త్రాలు ధరిస్తున్న వారికి జరిమానా Read more

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం శంకుస్థాపన
విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయం – భువనేశ్వరి శంకుస్థాపన

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ నడిపిస్తున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తరించనున్నాయి. త్వరలోనే విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏర్పాటు కానుంది. ఈ నెల 6న ట్రస్ట్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *