హైదరాబాద్ నగరంలోని మందుబాబులకు ఈ వారాంతం ఊహించని షాకే తగిలింది. శనివారం జరగనున్న హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయి. రెగ్యులర్గా వీకెండ్ పార్టీ ప్లాన్ చేసుకునే వారెవరికైనా ఇది కచ్చితంగా డిజప్పాయింట్మెంట్.పోలీసులు అందించిన తాజా సమాచారం ప్రకారం. ఏప్రిల్ 12వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి, రోజు అంటే ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాన్ని పూర్తిగా నిలిపివేస్తారు. ఇది కేవలం వైన్ షాపులకు మాత్రమే కాదు.బార్లు, కల్లు దుకాణాలు, ప్రైవేట్ క్లబ్బులు అన్నింటికీ వర్తిస్తుంది.పబ్లిక్ భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం హనుమాన్ జయంతిని ప్రశాంతంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మద్యం కారణంగా ఆ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు ముందస్తు జాగ్రత్తగా ఈ ఆదేశాలు జారీ చేశారు.ఇటీవలే శ్రీరామ నవమి సందర్భంగా కూడా మద్యం దుకాణాలు మూతపడ్డ సంగతి గుర్తుండే ఉంటుంది.

అప్పటిలాగే ఇప్పుడు కూడా వారం చివరలో మద్యం దుకాణాలు బంద్ కావడం మందు ప్రియులకు నిరాశ కలిగిస్తోంది. స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసినవారు ఇప్పుడు స్వల్ప అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.ఇదే సమయంలో కుటుంబంతో గడపాలనుకునే వారికి ఇది ఓ మంచి అవకాశం కావొచ్చు. వారం రోజుల పనుల ఒత్తిడిలో నుండి రిలీఫ్ కావాలంటే… అల్కహాల్ లేని సండే తప్పనిసరి కావొచ్చు కదా?హైదరాబాద్ పోలీసులు వినియోగదారులకు ముందుగానే హెచ్చరికలు జారీ చేయడంతో… ఎవరైనా మద్యం కొనాలనుకుంటే శుక్రవారం లోపలే తమ అవసరాలను తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు, రేస్ట్రెంట్లు, బార్లలో మద్యం అందుబాటులో లేకపోవడం, వారి వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.హనుమాన్ జయంతి రోజున శాంతిభద్రతలను కాపాడేందుకు తీసుకుంటున్న ఈ చర్యను పౌరులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మద్యం లేని వీకెండ్ను కుటుంబంతో కలిసి ఉత్సాహంగా గడపాలనే సందేశాన్ని ఈ నిర్ణయం ఇస్తోంది.