భారత మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ విజయం, ఈ సారి రెండవసారి. 2023లో ఒకటవసారి విజయం సాధించిన ఈ జట్టు, తాజాగా 2025లో మరోసారి ప్రపంచ కిరీటాన్ని కైవసం చేసుకుంది. కౌలాలంపూర్లోని బయుమాస్ ఓవల్ మైదానంలో దక్షిణాఫ్రికాను ఓడించి, భారత్ అండర్-19 మహిళల జట్టు 2వసారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది.ప్రపంచ కప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ చేస్తూ 82 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. టీమ్ ఇండియా తరఫున గొంగడి త్రిష 3 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబరిచింది. పరుణికా సిసోడియా, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ ఒక్కొక్కరి 2 వికెట్లు సాధించారు.భారత జట్టు, 83 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది. గొంగడి త్రిష 33 బంతుల్లో 44 పరుగులతో అజేయంగా నిలిచింది.

సానికా చాల్కే కూడా 26 పరుగులతో ఆకట్టుకుంది.11.2 ఓవర్లలో 84 పరుగులు చేసి, భారత జట్టు 9 వికెట్లతో ఘన విజయం సాధించింది.ఈ విజయం భారత అమ్మాయిలకు ఎంతో గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ఈ విజయానికి భారత మహిళల జట్టుకు రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ నగదు బహుమతి క్రీడాకారులు, సిబ్బంది మధ్య పంచబడనుంది.అయితే, ఐసీసీ ఈవెంట్లో గెలిచే ప్రతి జట్టుకు బహుమతిగా డబ్బు అందించబడుతుందనినప్పటికీ, అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు ఐసీసీ నుండి ఎలాంటి రివార్డ్ లభించలేదు.
ఐసీసీ ప్రోటోకాల్ ప్రకారం, అండర్-19 ప్రపంచ కప్ విజేతలకు డబ్బు బహుమతులు ఇవ్వరు. అలాగే, అండర్-19 పురుషుల ప్రపంచ కప్ విజేతలకు కూడా డబ్బు ఇవ్వడం లేదు.ఈ సందర్భంలో, ఐసీసీ చైర్మన్ జైషా ప్రపంచ కప్ ట్రోఫీని అందించి, ఆటగాళ్లకు పతకాలు ఇచ్చారు. కానీ బీసీసీఐ మాత్రం భారత మహిళల జట్టుకు భారీ నజరానా ప్రకటించింది, ఇది వారి కృషికి పెద్ద గౌరవం.