ap sub registrar office

Sub Registration Offices : ఏపీలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రేపు సెలవు రద్దు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రెండో శనివారం సెలవుగా ఉండే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు, ఈ నెల 12న సెలవు ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారికంగా మెమోను జారీ చేసింది. ఏప్రిల్ 12 (శనివారం)న ఆఫీసులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పని చేయనున్నాయని స్పష్టం చేసింది.

Advertisements

రిజిస్ట్రేషన్లపై ప్రజల నుంచి భారీ స్పందన

ప్రస్తుతం రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లపై ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తున్న నేపథ్యంలో, ఎక్కువగా వర్కింగ్ డేస్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హాలిడేలు, వీకెండ్ సమయంలో అత్యవసర రిజిస్ట్రేషన్ల కోసం రూ.5వేలు చెల్లించి సేవలు పొందే వెసులుబాటు కూడా ఉంది. అయితే రేపు శనివారం మాత్రం ఆ రుసుము లేకుండానే సేవలు అందించనుంది.

ap sub registrar office 2

ప్రజలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం

ఇది ప్రజలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంగా ప్రభుత్వం పేర్కొంది. ఎక్కువమంది తమ రిజిస్ట్రేషన్ పనులను పూర్తి చేసుకోవడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. తద్వారా ప్రజల సౌకర్యార్థం సెలవును రద్దు చేసి, పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు కార్యాలయాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

Related Posts
ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించాం: సీఎం
We are determined to make AP clean.. CM Chandrababu

కందుకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కందుకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో Read more

వంశీ అరెస్టుపై లోకేశ్ స్పందన
వంశీ అరెస్టుపై లోకేశ్ స్పందన

ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో డీటీపీ ఆపరేషన్ సత్యవర్ధన్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును వెనక్కి తీసుకోవాలని వైసీపీ Read more

తెలంగాణ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ ను వాడేశారు
powerbill

తెలంగాణలో వేసవి ఇంకా ప్రారంభమవ్వకముందే విద్యుత్ వినియోగం రికార్డులు తిరగరాస్తోంది. రాష్ట్ర ప్రజలు 16,293 మెగావాట్ల విద్యుత్ను వినియోగిస్తూ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించారు. ఇటీవల ఫిబ్రవరి Read more

పార్టీ నేతలతో టీపీసీసీ చీఫ్ జూమ్ మీటింగ్
TPCC chief Mahesh Kumar Zoom meeting with party leaders

మండల అధ్యక్షులకు దిశానిర్దేశం హైదరాబాద్‌: రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. పట్టభద్రుల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×